ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
డయాగ్నోస్టిక్ సెంటర్ పరిశీలన
ఎదులాపురం,జూన్6 : జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలతో పాటు ఉచితంగా అన్ని రకాల పరీక్షలకు ప్రభుత్వం తెలంగాణ రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. ల్యాబ్ను పరిశీలించి పరీక్షల విధానాన్ని డీఎంహెచ్వోను అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 57 రకాల పరీక్షల నిర్వహణకు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణ గా తీర్చిదిద్దేలా సీఎం కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళ, బుధవారాల్లో ఈ సెంటర్ను ప్రారంభించనట్లు తెలిపారు. మంత్రి ఐకే రెడ్డి హాజరుకాన్నుట్లు వెల్లడించారు. ప్రజలకు ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందించేదుకు ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. ప్రైవేట్లో రూ. 5వేల నుంచి రూ.10వేల దాకా ఖర్చు అవుతుందన్నారు. వైద్యాఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వీటి నిర్వహణ ఉంటుందన్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు, ఉన్నారు.