నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి జన్మదిన వేడుకలు
పలు చోట్ల సేవా కార్యక్రమాలు
హుజూర్నగర్, ఆగస్టు 4 : ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పుట్టినరోజు వేడుకలు బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు వేడుకల్లో పాల్గొని మొక్కలు నాటారు, పలుచోట్ల పేదలకు పండ్లు పంపిణీ చేశారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కోదాడ తిరుమల ఆస్పత్రి సమక్షంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 5వ వార్డు కౌన్సిలర్ దొంగరి మంగమ్మ ఆధ్వర్యంలో ప్రెస్క్లబ్ కార్యాలయం వద్ద మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకుడు నగేశ్ రాథోడ్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ ఆధ్వర్యంలో వేడుకలు చేశారు. జాగృతి ఆధ్వర్యంలో 15వ వార్డులోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటారు. గౌడ కులస్తులు ఎమ్మెల్యే యోగక్షేమాలు కోరుతూ కంఠమహేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. నేరేడుచర్లలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. గరిడేపల్లి మండలం వెలిదండలో ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో 20 మంది గర్భిణులకు సీమంతం నిర్వహించి చీరలు, గాజులు, పండ్లు పంపిణీ చేశారు. పొనుగోడులో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జోగు అరవిందరెడ్డి ఆధ్వర్యంలో ఆలేటి ఆటం ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. పాలకవీడు మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మలమంటి దర్గారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనృసింహ ఆలయంలో ఎంపీపీ పార్వతీకొండానాయక్ సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. చింతలపాలెం మండలంలో పార్టీ అధ్యక్షుడు మోర్తాల వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. మేళ్లచెర్వు మండలంలో జరిగిన వేడుకల్లో సర్పంచ్ శంకర్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్ కేక్ కట్ చేశారు. ఎంపీపీలు గూడెపు శ్రీనివాస్, కొత్తమద్ది వెంకట్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వేములూరి రంగాచారి, టీఆర్ఎస్ చింతలపాలెం మండలాధ్యక్షుడు మోర్తాల వెంకట్రెడ్డి, హుజూర్నగర్ మండలాధ్యక్షుడు చావా వీరభద్రారావు, సర్పంచులు అంజిరెడ్డి, మన్నెం శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ భూక్యా జ్యోతి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్గౌడ్, నాయకులు గాబుల శ్రీను, గులాం హుస్సేన్, వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు ఓరుగంటి నాగేశ్వర్రావు, సౌజన్య, రాంగోపి, గంగరాజు పాల్గొన్నారు.
విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
నేరేడుచర్ల : ఎమ్మెల్యే సైదిరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 15మంది విద్యార్థులకు టీఆర్ఎస్ పట్టణాధ్యక్షురాలు చల్లా శ్రీలత, విజయభాస్కర్రెడ్డి దంపతులు సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జయబాబు, ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ నర్సయ్య, మార్కెట్ చైర్మన్ యశోదారాములు, గ్రంథాలయ చైర్మన్ మార్కండేయ, కౌన్సిలర్లు బాషా, సాయి, సరిత, నాగవేణి, లలిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న నేరేడుచర్ల పట్టణానికి చెందిన పానుగంటి కృష్టయ్యకు టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో 10వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.