ఎమ్మెల్యే భాస్కర్రావు
మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
దామరచర్ల, ఆగస్టు 4 : టీఆర్ఎస్ పాలనలోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండలంలోని కొత్తపేట తండా నుంచి దిలావర్పూర్ వరకు కోటి 80 లక్షలతో మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని గ్రామా ల్లో వందశాతం సీసీ, బీటీ రోడ్లు వేస్తామన్నారు. ఎంపీపీ నందిని, జడ్పీటీసీ లలిత, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచులు ధనావత్ శాంతి, శారద, యమున, ఎంపీటీసీలు వీరూ నాయక్, బెజ్జం సైదులు, లింగారెడ్డి పాల్గొన్నారు
భగ్యా గోప సముద్రం తండా నుంచి రాఘవాపురంతండా
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని భగ్యా గోప సముద్రం తండా నుంచి చిల్లాపురం మీదుగా రాఘవాపురంతండా వరకు రూ.63 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భాస్కర్రావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ అజ్మీరాబాబు, సాలి, బిక్కి, వినయ్ పాల్గొన్నారు.
మల్లమ్మ కుటుంబానికి పరామర్శ
మిర్యాలగూడ : పట్టణానికి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ ఐలమల్లమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పరామర్శించారు. మల్లమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, నల్లమోతు సిద్దార్థ్ద, స్కైలాబ్నాయక్ ఉన్నారు.