ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండి తహసీల్ కార్యాలయం ప్రారంభం
చొప్పదండి, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తుదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ.10లక్షలతో ప్రజల కోసం నిర్మించిన విశ్రాంత గది, అధికారుల ఆఫీస్ రినొవేషన్ గదులను అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు సకల వసతులు, సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తహసీల్దార్ కార్యాలయాల ఆధునీకరణ కోసం రూ.10లక్షల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ నిధులతో చొప్పదండి తహసీల్దార్ కార్యాలయాన్ని ఎంతో అందంగా తయారు చేశారని అభినందించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఆహ్లాదకమైన వాతావరణాన్ని అందిస్త్తూ, వారు విశ్రాంతి తీసుకోవడానికి రేకుల షెడ్డు, మంచి నీటి సౌకర్యాలతో పాటు సకల ఏర్పాట్లు చేయించిన తహసీల్దార్ రజితను ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్కుమార్,జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్,సీఐ నాగేశ్వర్రావు , ఎస్ఐ వంశీక్రిష్ణ, మాజీ ఎంపీపీ వల్లాల క్రిష్ణహరి,కౌన్సిలర్లు దండెజమున, మాడూరి శ్రీనివాస్, కొట్టె అశోక్, కమిషనర్ అంజయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోకరాజేశ్వర్రెడ్డి, సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, లింగయ్య, నాయకులు నలుమాచు రామక్రిష్ణ, వెల్మ శ్రీనివాస్రెడ్డి, మునిగాల చందు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు స్వామిరెడ్డి, గాండ్ల లక్ష్మణ్, మావురం మహేశ్ పాల్గొన్నారు.