ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
మదనాపురం, ఆగస్టు 2 : పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నాయిని హన్మంతు (55) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల సోమవారం మండల నాయకులతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి హన్మంతు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు, అండగా ఉంటానని చెప్పి మృ తుడి భార్యకు రూ.20వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హన్మంతు మృతి పార్టీకి తీరని లోటన్నారు. పార్టీ పటిష్టత కోసం ఆయన చేసి సేవలు మరువలేనివని కొనియాడారు. ఎమ్మెల్యే వెంట జె డ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్నారాయ ణ, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి ప్రశాంత్, సర్పంచులు శారద, రాంనారాయణ, ఎంపీటీసీ సరస్వతి, కురుమూర్తి ఆలయ కమిటీ సభ్యుడు గోపిస్వామి, మార్కెట్ కమిటీ చైర్మ న్ బాలనారాయణ, డైరెక్టర్లు వెంకటేశ్యాదవ్, తిరుపత య్య, వెంకటేశ్వర్రెడ్డి, సీడీసీ డైరెక్టర్ బాలకృష్ణ, పట్టణాధ్యక్షుడు సత్యంయాదవ్, మాజీ వైస్ ఎంపీపీ శంకర్బాబు, మాజీ ఎంపీటీసీ మాసన్న, కుర్మన్న, కృష్ణ, వా సురెడ్డి, కొం డారెడ్డి, రాములు, నాగశేషు, మనోజ్కుమార్ పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
కొత్తకోట, ఆగస్టు 2 : మండలంలోని కానాయపల్లి గ్రామం లో రావుల నర్సింహారెడ్డి ఇటీవల మృతి చెందాడు. విష యం తెలుసుకున్న ఆల వెంకటేశ్వర్రెడ్డి సోమవారం మృతు ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే పట్టణంలోని యువకుడు వంశీధర్రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ యువకుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆ యన వెంట జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, సింగిల్విండో మాజీ చైర్మన్ సురేందర్నాథ్రెడ్డి, నాయకులు జగన్మోహన్రెడ్డి, సత్యంయాదవ్, గోపాల్రెడ్డి, సుభాష్, శేఖర్గౌడ్, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనుజీ ఉన్నారు.