సూర్యాపేట మండలంలో 17 బస్షెల్టర్లు
నిధులు మంజూరు చేసిన మంత్రి జగదీశ్రెడ్డి
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
సూర్యాపేట రూరల్, ఆగస్టు 2 : మండలంలోని గ్రామాల్లో, రహదారుల వెంట బస్షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. బస్సుల కోసం ఎండ, వానల్లో పడిగాపులు గాయాల్సి వచ్చింది. దీంతో స్థానిక నాయకులు సమస్యను ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పంది ంచిన మంత్రి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి వివిధ గ్రామాల్లో 17 బస్షెల్టర్ల నిర్మాణానికి డబ్బులు మంజూరు చేశారు. ఒక్కో బస్షెల్టర్కు రూ.3 లక్షలు కేటాయించడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో బస్షెల్టర్ల నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయి.
ఏయే గ్రామాల్లో నిర్మిస్తున్నారంటే..
మండలంలోని రాయినిగూడెం, టేకుమట్ల, ఎండ్లపల్లి, రామారం, రత్నపురం, రామచంద్రాపురం, సోలిపేట, గాంధీనగర్, బాలెంల, యర్కారం, రాజునాయక్తండా,ఇమాంపేట, దాసాయిగూడెం, కాసరబాద, తాళ్లకాంపాడ్, రామన్నగూడెం, పిల్లలమర్రి స్టేజీ వద్ద షెల్టర్లు నిర్మిస్తున్నారు.
సంతోషంగా ఉంది
ప్రభుత్వం బస్షెల్టర్లు నిర్మించడం సంతోషంగా ఉంది. రోడ్డు వెంట షెల్టర్లు లేకపోవడంతో ఎండ, వానకు ప్రజలు ఇబ్బందులు పడేవాళ్లు. ప్రజల సౌకర్యార్ధం బస్షెల్టర్లు నిర్మిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు.
-నర్ర పరమేశ్, సోలిపేట