పాలకుర్తి: నిత్యావసర సరుకులను అందజేస్తున్న ఎమ్మెల్యే చందర్
కుక్కలగూడూర్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసాయాత్ర
పాలకుర్తి, జూన్1: పాలకుర్తి మండలం కుక్కలగూడూర్లో మంగళవారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కరోనా పేషెంట్లకు అండగా భరోసాయాత్ర నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రామగుండంలోని అన్ని డివిజన్లు, అన్ని గ్రామాల్లో బాధితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఇంటింటికీ నిత్యావసరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్తోపాటు అనేక చర్యలు తీసుకుంటుండడంతో కరోనా పాజిటివ్ రేటు గణనీయంగా తగ్గిపోతుందని వివరించారు. థర్డ్వేవ్ ప్రమాదం పొంచి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, పిల్లలు, మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కుక్కలగూడూర్, వేంనూర్లోని కరోనా బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. యాత్రలో ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యరాంరెడ్డి, వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, మేడిపల్లి విండో చైర్మన్ మామిడాల ప్రభాకర్, సర్పంచ్ గోండ్ర చందర్, టీఆర్ఎస్ నాయకులు కుదిరె సతీశ్, మాదాసు అరవింద్, పొన్నం రామాగౌడ్ పాల్గొన్నారు.