ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
రూ. 12 కోట్ల వ్యయంతో అందోల్- జోగిపేటలో రోడ్డు పనులు ప్రారంభం
అందోల్, జూలై 31: రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టి పనులు త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఎర్రారం నుంచి అందోల్-జోగిపేట పట్టణం మీదుగా సంగుపేట వరకు రూ. 12కోట్ల వ్యయంతో 12 కిలోమీటర్లమేర నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. గత పాలకుల నిర్లక్ష్యంగా కారణంగా అందోల్- జోగిపేట పట్టణం పరిధిలో రోడ్డు పూర్తిగా పాడై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సమస్యను మంత్రి హరీశ్రావుకు వివరించానన్నారు. ఆయన సానుకూలంగా స్పందించి నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి ఎంపీ బీబీ పాటిల్ను ఢిల్లీకి పంపించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఇందుకు సహకరించిన మంత్రి హరీశ్రావు, ఎంపీ బీబీ పాటిల్కు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ రోడ్డు పూర్తైతే ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో విక్టర్, మున్సిపల్ కమిషనర్ నిర్మల, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, జడ్పీటీసీ రమేశ్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, కో-ఆప్షన్ సభ్యుడు ఫైజల్, కౌన్సిలర్ దుర్గేశ్, నాయకులు లక్ష్మణ్, నాగరత్నంగౌడ్, సంతోశ్, రవీంద్రగౌడ్, శంకర్, మహేశ్యాదవ్, అనిల్, సత్యం మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.