మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 31 : ప్రభు త్వం అమలు చేసిన కొత్త పీఆర్సీ పోలీసు సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేట్లు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో శాంతిభద్రతలు, పోలీసు సిబ్బంది సమస్యలు, జిల్లాలో అక్రమాల పై నిఘా వివరాలను వెల్లడించారు. మొత్తం 10, 300 మంది పోలీసు సిబ్బంది కొత్త పీఆర్సీ తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ట్లు చెప్పారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా టాస్క్ఫోర్స్ నిఘా ఉంచినట్లు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా ఇంకా తగ్గలేదని, ప్రతిఒక్కరూ మా స్కులు ధరించాలని సూచించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తున్నామని, ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు చ ర్యలు తీసుకున్నట్లు చెప్పారు. లాక్డౌన్లో నిబంధనలకు విరుద్ధంగా బయట తిరిగిన 8500 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.