ఉస్మానియా యూనివర్సిటీ: పారిశుద్ధ్య కార్మికులు ముందు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి సూచించారు. కరోనా నుంచి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో పీపీఈ కిట్లను సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. దానితో పాటు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనన్నారు. మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్ వినియోగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, జీహెచ్ఎంసీ ఏఎంవోహెచ్ డాక్టర్ రవీందర్గౌడ్, డిప్యూటీ ఈఈ గీత, టీఆర్ఎస్ నాయకులు ఖాజా పాషా, బాబు, నాను నాయక్ తదితరులు పాల్గొన్నారు.