వేములవాడ రూరల్, మే 4: రైల్వే లైన్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వపరంగా నష్ట పరిహారం అందజేస్తామని ఆర్డీవో శ్రీనివాస్రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేములవాడ మండలం అనుపురం, నాంపెల్లిలో మనోహరాబాద్-కొత్తపల్లి వరకు నిర్మించే రైల్వే లైన్ కోసం భూసేకరణ చేపట్టామన్నారు. అందులో భాగంగా అనుపురంలో 15.12 ఎకరాలు, నాంపెల్లిలో 47.7ఎకరాల భూమిని కోల్పోతున్నారని చెప్పారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ భూనిర్వాసితులతో గ్రామసభ నిర్వహించామన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా గ్రామ సభ ఏర్పాటు చేసి భూ నిర్వాసితులతో చర్చించామన్నారు. నష్ట పరిహారం అందిస్తామని, భూ సేకరణలో సర్వే నంబర్ తప్పులు, అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించామని పేర్కొన్నారు. వైరస్ నేపథ్యంలో అందుబాటులో లేని వారి కోసం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు. తహసీల్దార్ నక్క శ్రీనివాస్, మునీందర్, జడ్పీటీసీ మ్యాకల రవి, సర్పంచ్ కొండపల్లి వెంకటరమణ, ఎంపీడీవో నరేశ్ఆనంద్, భూనిర్వాసితులు పాల్గొన్నారు.
ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేయండి
రైల్వే లైన్లో భూమిని కోల్పోతున్న నిర్వాసితుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని పలువురు నిర్వాసితులు భూ సేకరణ అధికారి, ఆర్డీవో శ్రీనివాస్రావుకు వినతిపత్రం అందజేశారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.