అధిక ఫీజు వసూళ్లపై నిఘా
ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూం
కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు
పరిస్థితులను సమీక్షిస్తున్న భద్రాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డి
కొత్తగూడెం, ఏప్రిల్ 30: కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతున్నది. ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో యంత్రాంగం వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. పాజిటివ్ వచ్చిన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. వైద్య సిబ్బంది వారు త్వరగా కోలుకునే విధంగా పర్యవేక్షిస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అవసరమైన మెడిసిన్ చేరవేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డి జిల్లాలోని చికిత్సకు అనుమతులు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, ప్రభుత్వ ఆస్పత్రులకు ఇన్చార్జులను నియమించారు. అలాగే జిల్లా, మండల స్థాయిలో వైరస్పై అవగాహన కల్పించేందకు గాను ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. ఇప్పటికే మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కిందిస్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లాస్థాయిలో పర్యవేక్షణ వీరిదే..
కంట్రోల్ రూం నెంబర్కు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్, ఆక్సిజన్ నిల్వల పర్యవేక్షణకు జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో మధుసూదనరాజు, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షణకు ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్ను నియమించారు. జిల్లావ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలను డీపీవో రమాకాంత్ పర్యవేక్షిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్ బాధత్యలు చూసుకుంటారు.108 వాహనాల్లోనూ ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో ఉండేలా ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకుంటారు.
అధిక ఫీజులు వసూళ్లకు చెక్..
ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. బాధితులు ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులకు ఇన్చార్జులను నియమించింది. ప్రజలు కలెక్టరేట్లోని 08744-241950, 246655 నెంబర్లను అందుబాటులో ఉంచి ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించింది. కలెక్టర్ ఎంవీ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా జిల్లా, మండల అధికారులతో కాన్ఫరెన్స్లు నిర్వహించారు. గ్రామస్థాయిలో కరోనాపై మరింత అవగాహన పెంచాలన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో బాధ్యులు..
జిల్లా ఆస్పత్రి కొత్తగూడెం ఇన్చార్జిగా డాక్టర్ ఎ.వెంకన్న (79815 95240), భద్రాచలం ఏరియా ఆస్పత్రికి డాక్టర్ కృష్ణ (94947 87782), మణుగూరు ఏరియా ఆస్పత్రికి డాక్టర్ వెంకటేశ్వర్లు (98667 91829), అశ్వారావుపేట సీహెచ్సీకి డాక్టర్ డి.వెంకటేశ్వర్లు (92522 90707), ఇల్లెందు సీహెచ్సీకి డాక్టర్ సతీశ్ (80473 56401) నియమితులయ్యారు.
ప్రైవేటు ఆస్పత్రుల పరిధిలో..
కొత్తగూడెంలోని అమృత మల్టీ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఇన్చార్జిగా డాక్టర్ బాబురావు (98483 16248), గాయత్రి హాస్పిటల్కు డాక్టర్ నాగరాజు (99488 98855), శ్రీలలితా పద్మావతి నర్సింగ్ హోంకు డాక్టర్ సీఆర్పీఎస్ కృష్ణ (98482 22512), కార్తికేయ ఎమర్జెన్సీ సెంటర్కు డాక్టర్ చెన్నం లక్ష్మయ్య (99487 95789), స్వేచ్ఛ హాస్పిటల్కు డాక్టర్ మన్మథరావు (81256 31849), సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు డాక్టర్ సురేశ్ (83280 51804), సీఎస్ మెమోరియల్ హాస్పిటల్కు రాజ్యలక్ష్మి (82476 29643), ప్రవీణ్ ఎమర్జెన్సీ హాస్పిటల్కు డాక్టర్ ప్రవీణ్రెడ్డి (99859 56768), సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్కు డాక్టర్ రంగారావు (98483 42790), యశోద హాస్పిటల్కు డాక్టర్ రాకేశ్ (91001 60106), వెన్నెల హాస్పిటల్కు డాక్టర్ అనిరుధ్ (89777 69042), పాల్వంచలోని శ్రీబాలాజీ చెస్ట్ అండ్ డయాబెటీస్ ఆస్పత్రికి డాక్టర్ భార్గవరాం (90105 93523), అను మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వేణుగోపాల్ రెడ్డి (81794 14327), పృథ్వీ జనరల్ హాస్పిటల్కు డాక్టర్ పృథ్వీ (75666 28823), విజయ్ సాయి హాస్పిటల్కు డాక్టర్ కిరణ్ 97000 27727, భద్రాచలంలోని జయభారతి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్కు సుదర్శన్ (98489 73498), ప్రభాశంకర్ హాస్పిటల్కు డాక్టర్ కిరణ్ (99595 75425), శ్రీనివాసా నర్సింగ్ హోంకు డాక్టర్ మోహన్రావు (81211 11181), అఖిల హాస్పిటల్కు డాక్టర్ జి.మహేశ్ (8978025432), మణుగూరులోని శ్రీసాయి మమత హాస్పిటకు డాక్టర్ శశిధర్ (99595 65154) నియమితులయ్యారు.