వరంగల్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక చివరి అంకానికి చేరింది. ఆదివారం పోలింగ్ జరుగనుండగా అధికారయంత్రాం గం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని నియోజకవర్గంలో 5,05,368 మంది ఓటర్లు ఉన్నారు. 71 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,84,897 మంది ఓటర్లుండగా, అధికారులు 199 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. పో లింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8గంటలకు మొదలు కానుంది. సా యంత్రం నాలుగు గంటల వరకు జరగనుం ది. బరిలో నిలిచిన వారు ఎక్కువ మంది ఉం డడంతో మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పెద్ద సైజు బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. పోలింగ్ ప్రక్రియ కోసం అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. సామగ్రి మొత్తం శనివారం సాయంత్రం వరకే పోలింగ్ కేంద్రాలకు చేరింది. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బరిలో ఈసారి ఎక్కువ మంది ఉండగా టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పోటీలో నిలిచారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుటికంటే ముందునుంచే ఆయన ప్రతి మండలంలో, కొన్ని గ్రామాల్లోనూ ఓట ర్లు స్వయంగా కలిసి మద్దతు కోరుతూ వచ్చా రు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, చీఫ్విప్ వినయభాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్ పర్స న్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉండనున్నాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల కంటే ప్రచారంలో ముందుండడం కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు.