పూర్వ విద్యార్థులతో ప్రత్యేక సమావేశం
ఆదిలాబాద్ రూరల్, మార్చి 15: జిల్లాకేంద్రంలోని శాంతినగర్లో ఉన్న ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం సోమవారం తనిఖీ చేసిం ది. ఉదయం 8.30 గంటలకు సభ్యులు జోధపూర్ వైస్చాన్స్లర్ డా. పీ.సీ.త్రివేది, ఒడిశాలోని బరంపూర్ ప్రొఫెసర్ జుగల్కిశక్షర్ మిశ్రా, ముంబైకి చెందిన ప్రొఫెసర్ గోపాల్ కల్కోటి చేరుకోగా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం ఎన్సీసీ కెడేట్ల గౌరవవందనం స్వీకరించారు. ముందుగా ప్రిన్సిపాల్, విద్యార్థులు , అధ్యాపకులు, కోర్సులు, మౌలికవసతులపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఒక్కో హెచ్వోడీల వసతులు, విద్యార్థుల సామర్థ్యాలు, కోర్సుల అనంతరం విద్యార్థులు సాధించిన విజయాలపై క్షుణ్ణం గా అడిగి తెలుసుకున్నారు. ప్రతి అంశాన్నీ సభ్యులు జాగ్రత్తగా పరిశీలిస్తూ మార్కులు వేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ని ర్వహించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ డా.పీ.సీ. త్రివేది మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల కమిటీని రిజిస్ట్రేషన్ చేయించి, కళాశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులందరూ అందులో చేరేలా చేసి విద్యార్థులకు స్కాలర్షిప్స్, బుక్స్, పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం, పార్కుల అభివృద్ధి, కళాశాలలో క్రీడావసతుల లాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ఇదే కళాశాల విద్యార్థి కావడంతో ఆయనతో మాట్లాడి ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నిధులు విడుదల చేయించి కళాశాలలో మరిన్ని మౌలిక వసతుల కల్పన కు కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ , పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, వెంకట్, టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు సంద అశోక్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాల సందర్శన
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం జాయింట్ డైరెక్టర్ యాదగిరి సందర్శించారు. కళాశాలకు విచ్చేసిన ఆయనకు అధ్యాపకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా కళాశాల సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో న్యాక్ గ్రేడ్ను పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు 7 అంశాల ఆధారంగా అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. దీనిని పాఠ్యాంశంలో భాగంగా పరిగణించాలని పేర్కొన్నారు. అనంతరం అధ్యాపకుల పలు సందేహాలను నివృత్తి చేశారు. కళాశాల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం లెక్చరర్లు ఆయనకు పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భీంరావు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.