నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 13: జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు శనివారం ఘనం గా నిర్వహించారు. కవిత పుట్టిన రోజు సందర్భంగా పలు కార్య క్రమాల్లో నగర మేయర్ దండు నీతూ కిరణ్ పాల్గొన్నారు. నగరం లోని సుభాష్నగర్ బాల సదన్లో అనాథ పిల్లలతో కలిసి కేక్కట్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు సిర్పరాజు ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస్తాలో కేక్కట్ చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మేయర్ సుజాత, మురళి, సువర్ణ రాజు, కార్పొరేటర్ సాయివర్ధన్ పాల్గొన్నారు. టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కవిత చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సారంగపూర్ హనుమాన్ మందిరంలో టీఆర్ఎస్ నాయకులు ఉప్పలరవి పూజలు చేశారు. తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసి యేన్ ఆధ్వర్యంలో గౌతంనగర్ బేతెస్త ఏజీ చర్చిలో కేక్కట్చేశారు. నుడా డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో న్యాల్కల్లో ఉన్న అంధుల పాఠశాలలో విద్యార్థు లతో కలిసి కేక్కట్ చేశారు. టీఆర్ఎస్ నాయకుడు ఎస్.పోశెట్టి ఆధ్వర్యంలో కేక్కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత ఆధ్వర్యంలో, చెవిటి, మూగ పాఠశాలలో రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు, అంకాపూర్లోని లాలన వృద్ధాశ్రమంలో తెలంగాణ జాగృతి నియోజకవర్గ అధ్యక్షుడు సాయినాథ్, ఆర్మూర్ అధ్యక్షుడు శ్రీనివాసబాలు కేక్కట్ చేశారు. నందిపేట్, మాక్లూర్, బోధన్ మండలాల్లో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎంపీపీ బుద్దె సావిత్రి, సీనియర్ నాయకుడు బుద్దె రాజేశ్వర్ హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. జాడిజమాల్పూర్లో వృద్ధులకు జాగృ తి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఎడపల్లిలోని టీఆర్ఎస్ కా ర్యాలయంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు సుభాష్ నాయకులతో కలిసి కేక్కట్ చేశారు.
ఎంపీపీ కార్యాలయంలో టీఆర్ఎస్ యువజన విభా గం అధ్యక్షుడు సురేశ్ ఆధ్వర్యంలో ఐకేర్ ఫౌండేషన్ సహకారంతో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఉర్దూమీడియం పాఠశాలలో జాగృతి మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కేజీబీవీలో విద్యార్థులకు జడ్పీ వైస్ చైర్పర్సన్ పరీక్ష అట్ట లను పంపిణీ చేశారు. శాస్త్రీనగర్లోని వృద్ధాశ్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు రాచర్ల శేఖర్రాజ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశా రు. నవీపేట ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో మండల అధ్యక్షుడు వి.నర్సింగ్రావు ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఎంపీపీ శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. నవీపేట సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు క్రీడా సామగ్రితోపాటు కూల్ బాటిళ్ల కొనుగోలుకు రూ.7,500 నగదును ప్రిన్సిపాల్ నవీన్కుమార్కు అందజేశారు. పొతంగల్లో సర్పంచ్ రవీందర్రావు ఆధ్వర్యంలో, నవీపేట ప్రభుత్వ దవాఖానలో జాగృతి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పం పిణీ చేశారు. జన్నేపల్లిలో సర్పంచ్, ఎంపీటీసీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. రెంజల్ మండలం సాటాపూర్ ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణలో సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్పాషా ఆధ్వర్యంలో జర్నలిస్టులు, ఆరోగ్య, అంగన్వాడీ, ఆశ వర్కర్లను సన్మానించారు. తాడ్బిలోలి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, ప్లేట్లను పంపిణీ చేసినట్లు రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ మౌలానా తె లిపారు. బోధన్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కవిత జన్మదినం వేడుకలను పురస్కరించుకుని బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, ఎమ్మెల్యే షకీల్ సోదరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎహెతేషాం సోహెల్, టీఆర్ఎస్ బోధన్ నియోజకవ ర్గం నాయకుడు వీఆర్ దేశాయ్ ఆధ్వర్యంలో కేక్ను కట్చేశారు.
అనంతరం బోధన్లోని అంబేద్కర్ చౌరస్తాలో అన్నదానం చేశారు. అంతకుముందు ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్ల ను పంపిణీ చేశారు. చక్రేశ్వరాలయంలో, మారుతీ మందిరంలో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. జాగృతి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎహెతేషాం సోహెల్ బర్త్డే కేక్ను కట్చేశారు. టీఆర్ఎస్ నాయకులు వీఆర్ దేశాయ్, సతీశ్, జాగృతి జిల్లా నాయకుడు నర్సింహులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న యూసుఫ్ దర్గాలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ వాహబ్ భారీ, జాన్కంపేట్ సింగిల్విండో మాజీ అధ్యక్షుడు విజయ్కుమార్ గౌడ్ కలిసి చాదర్ను సమర్పించారు. మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో కవిత జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. పార్టీ కార్యాలయాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కల్లెడ ఏలియా, రేగుంట దేవేందర్ కేక్కట్ చేశారు. ఎంపీపీలు శ్రీనివాస్, గౌత మి, జడ్పీటీసీ రవి పాల్గొన్నారు. మెండోరాలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ గంగాధర్, సర్పంచు లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. భీమ్గల్లోని మున్సిపల్ కార్యాలయం వద్ద జడ్పీటీసీ రవి, టీఆర్ఎస్ మండల అధక్షుడు నర్స య్య, పట్టణ అధ్యక్షుడు లక్ష్మన్ ఆధ్వర్యంలో, ఎనిమిదో వార్డు సభ్యుడు సతీశ్ ఆధ్వర్యంలో, జాగృతి నియోజకవర్గ కో-కన్వీనర్ రంజిత్గౌడ్, కౌన్సిలర్ సతీశ్గౌడ్ కేక్ కట్ చేశారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. వేల్పూర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ జమన, జడ్పీటీసీ భారతి, ఆర్టీఏ సభ్యుడు రాములు, సర్పంచులు, మా ర్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీటీసీలు పాల్గొన్నా రు.
ఏర్గట్లలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఎంపీపీ ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్, మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం కేక్కట్ చేశారు. ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు మధుసూదన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అంజయ్య, సొసైటీ చైర్మన్ నర్సయ్య పాల్గొన్నారు. ముప్కాల్లో మండల అధ్యక్షుడు భూమేశ్వర్, ఎం పీపీ పద్మ వెంకటరెడ్డి, జడ్పీటీసీ నర్సవ్వ నర్సారెడ్డి ఆధ్వర్యంలో, బాల్కొండ మండలం కిసాన్నగర్లో వెంకటేశ్వర్, వీరాయూత్ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో పూజలు చేశారు. బాల్కొండలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్రెడ్డి పండ్లు పంపిణీ చే శారు. నందిపేట్ మండలంలో టీఆర్ఎస్, జాగృతి నాయకులు క విత జన్మదిన వేడుకలను నిర్వహించారు. టీయూలో అభ యాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆర్ట్స్ కళా శాలలో బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యెండల ప్రదీప్ ఆధ్వ ర్యం లో కేక్ కట్ చేశారు. మానవతా సదన్లో కవిత జన్మదిన వేడు కల ను ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు.
డిచ్పల్లి మండలంలోని ఘన్పూర్ ఉన్నత పాఠ శాల లో జడ్పీటీసీ ఇందిరా, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ, సిరికొండ మండలంలోని కస్తూర్బా పాఠశాలలో, ధర్పల్లిలోని న్యూ గురడిరె డ్డి సంఘంలో ఎంపీపీ నల్ల సారికారెడ్డితో కలిసి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ కేక్ కట్ చేశారు. రూరల్ మండలంలోని శాస్త్రీనగర్ గ్రామం లో ఉన్న నిర్మల్ హృదయ వృద్ధాశ్రమంలో జడ్పీటీసీ సుమలత, ఎంపీపీ బానోత్ అనూష, వైస్ ఎంపీపీ సాయిలు ఆధ్వర్యంలో కేకకట్ చేసి పంచిపెట్టారు. వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు.
ఇందల్వాయిలో జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతికుమార్, మండల కన్వీ నర్ మహి పాల్, అరుణ్, భాస్కర్, దాసు, గణేశ్, శ్రీకాంత్, రూర ల్ మండలంలోని జాగృతి యువకులు పాల్గొన్నారు. తిర్మన్పల్లి గ్రామ పంచాయతీలో దివ్యాంగుల ఆధ్వర్యంలో కేక్ కట్చేసి పంచిపెట్టారు. కోటగిరిలో కవిత చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. జాగృతి నియోజకవర్గ కన్వీనర్ గంగాధర్పటేల్, కోటగిరి మండల టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షు రాలు హెచ్ స్వరూప, జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా రు. కోటగిరి మండలంలోని సోంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంగంగానగర్ (పీఎస్ ఆర్) పంచాముఖీ శివాలయం ఆవరణలో రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్రెడ్డి మొక్కలు నాటారు. హైదరాబాద్లో కవితను జడ్పీడీటీసీ తనూజ శ్రీనివాస్రెడ్డి దం పతులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాపూర్లో వైస్ ఎంపీపీ విమల ఆధ్వర్యంలో శివపార్వతి ఆలయంలో పూజలు చేశారు. వర్ని మండలం కోటయ్యక్యాంపు ఎస్సీ బాలికల వసతి గృహంలో, టీఆర్ ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు.