మహబూబ్నగర్, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ కష్టపడి పనిచేసింది. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు అంతా ఐక్యంగా ఉంటూ పార్టీ అభ్యర్థి గె లుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. పట్టభద్రుల ఓటు నమోదు నుంచి పోలింగ్ కేం ద్రంలో ఓటేసే వరకు పకడ్బం దీ వ్యూహంతో ముందుకు సాగారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యతతో పనిచేశారు. మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే చెందిన అభ్యర్థి సుర భి వాణీదేవి స్థానికత సైతం టీఆర్ఎస్కు ఎంతో కలిసి వచ్చింది. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన మరుసటి రోజు నుంచే టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా రంగంలోకి ది గారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఉమ్మడి జిల్లా ఎన్నికల ఇన్చార్జిగా నియమించడంతో.. ఆయన మొదటి రోజు నుంచే రంగంలోకి దిగా రు. మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోయారు.
ఆత్మీయ సమావేశాలతో ముందుకు..
ప్రతి నియోజకవర్గంలో పట్టభద్రులతో ఆత్మీయ స మావేశాలు ఏర్పాటు చేశారు. ఏ పార్టీ అభ్యర్థి కూడా వాణీదేవిలా సమావేశాల్లో పాల్గొనలేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూ సుకెళ్లింది. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు వచ్చేలా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఇత ర ప్రజాప్రతినిధులు, శ్రేణులు, పార్టీ అభిమానులు విశేషంగా కృషి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వరకు మం డలి ఎన్నికపై ఆచితూచి వ్యవహరించిన టీఆర్ఎస్.. ప్ర తిపక్షాలకు దిమ్మతిరిగేలా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ప్రధాని పీవీ కూతురు ఎస్.వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రతిపక్షాలకు ఆలోచించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతిపక్షాలు చేసిన ఎత్తుగడలను టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహంతో ఎదుర్కొన్నది. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్నూ కలిశారు. ఇం దుకోసం నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సన్నాహక సమావేశాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున నూతన ఓటర్ల ఎన్రోల్మెంట్ జరిగింది. గతంలో ఎ ప్పుడూ లేనంతగా 1,19,367 మంది పట్టభద్రులు ఈసారి ఓటు నమోదు చేయించుకోవడం విశేషం. అందులో 78.47 శాతం అంటే 92,772 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎ మ్మెల్సీ స్థానంలోనే అత్యధిక పోలింగ్ శాతం జోగుళాం బ గద్వాలలో జరిగింది. 14,876 మంది పట్టభద్ర ఓ టర్లు ఉండగా.. ఏకంగా 12,028 మంది ఓటేయడం గమనార్హం. 80.86 ఓటింగ్ శాతం నమోదు కావడం ఇక్కడి చైతన్యాన్ని సూచిస్తుంది. ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఎం తో శ్రమించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లతో సై తం నిరంతరం టచ్లో ఉంటూ వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు కృషి చేశారు. వాణీదేవి విద్యాసంస్థ ల్లో చదువుకున్న ఉమ్మడి జిల్లాకు చెందిన అనేకమంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఆమె గెలుపు కోసం కృషి చేశారు.
వాణీదేవి గెలుపు నల్లేరు మీద నడకే..
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. వివిధ సంఘాలు, ఉద్యోగులు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ప్రతి 50 ఓటర్లకు ఒక ఇన్చార్జితోపాటు నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లాల ప్రజాప్రతినిధులతో నిత్యం ప్రచారసరళి అనుగుణంగా వ్యవహరించారు. ఓటర్లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారికి ప్రభుత్వం చేపట్టిన అ భివృద్ధి పథకాలను వివరిస్తూ పార్టీ వైపు ఆకర్షించారు. అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే విద్యావేత్త, పీవీ కూతురు వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలంటూ చైతన్యాన్ని తీసుకొచ్చారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే పట్టభద్రులు టీఆర్ఎస్ పక్షానే నిలబడ్డారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఎంతో మందికి విద్యనందించిన గొప్ప వ్యక్తి వాణీదేవి మండలిలో అ డుగు పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.