నిరాడంబరంగా రాముని కల్యాణం
సీతారాంపూర్లో కల్యాణాన్ని తిలకించిన ఎమ్మెల్యే మదన్రెడ్డి
నర్సాపూర్,ఏప్రిల్21: మండల పరిధిలోని సీతారాంపూర్ లోని రామాలయంలో బుధవారం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ అర్చకులు శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా చేశారు. ఈ కల్యాణ వేడుకలను ఎమ్మెల్యే మదన్రెడ్డి హాజరై వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ రాముడి దయ వల్ల కరోనా ప్రభావం తగ్గి ప్రజలు సంతోషాలతో జీవించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నర్సింగరావు, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, కౌన్సిలర్ అశోక్గౌడ్, పండితులు హరిప్రసాద్ శర్మ పాల్గొన్నారు.
కౌడిపల్లిలో…
కౌడిపల్లి,ఏప్రిల్21: మండల కేంద్రంలోని రామాలయంలో సీతారాముల కల్యాణ వేడుక కనుల పండువగా జరిగింది. ఈ కల్యాణం ఎమ్మెల్యే మదన్రెడ్డి హాజరై వీక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకు లు, భక్తులు పాల్గొన్నారు.
తూప్రాన్లో…
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 21: కరోనా నిబంధనలను పాటిస్తూ తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణం ఘ నంగా నిర్వహించారు. తూప్రాన్లోని రామాలయంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ దంపతులు, వైస్చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు వెంకటేశ్, శ్రీశైలంగౌడ్, కుమ్మరి రఘుపతి, ఉమాసత్యలింగం, మామిండ్ల జ్యోతికృష్ణ, లక్ష్మీబాయి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్లాంపూర్ రామలింగేశ్వరాలయంలో జడ్పీటీసీ రాణిసత్యనారాయణ, సర్పంచ్ సుకన్య, దేవస్థానం కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమాల్లో పట్టణ, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు
నిజాంపేటలో….
నిజాంపేట , ఏప్రిల్ 21: మండలంలోని ఆయా గ్రా మా ల్లో శ్రీరామనవవి ఘనంగా నిర్వహించారు. నిజాంపేట లో ని హనుమాన్ ఆలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన సీతారాముల కల్యాణానికి గ్రా మస్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొల్చారంలో…
కొల్చారం, ఏప్రిల్ 21: మండల వ్యాప్తంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు కరోనా నిబంధనలు పాటిస్తూ సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి కల్యా ణాన్ని నిర్వహించారు. కొల్చారంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలను మఠం(శివాలయం) వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కిష్టాపూర్లో సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కల్యాణాన్ని నిర్వహించారు.
రామాయంపేటలో…
రామాయంపేట, ఏప్రిల్ 21: రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని డి.ధర్మారం, కోనాపూర్, కాట్రియాల, అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర్, తొనిగండ్ల గ్రామాల్లోశ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ..
చిలిపిచెడ్….
చిలిపిచెడ్, ఏప్రిల్ 21:శ్రీ రామనవమి పురస్కరించుకొని మండల పరిధిలోని రాందాస్గూడలో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, ఆత్మకమిటీ మాజీ డైరెక్టర్ పాల్గొన్నారు.
వెల్దుర్తి…
వెల్దుర్తి, ఏప్రిల్ 21: కరోనా వ్యాప్తి నేపథ్యంలో శ్రీరామనవమి ఉత్సవాలను భక్తులు, ప్రజలు మండల వ్యాప్తంగా నిరాబం డరంగా కల్యాణాన్ని నిర్వహించగా, మహిళలు పట్టువస్ర్తాలు సమర్పించారు.