పరిగి/వికారాబాద్ మార్చి 15: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలు పు మేరకు వివిధ బ్యాంకుల ఉద్యోగులు సోమవారం సమ్మె చేపట్టారు. మం గళవా రం కూడా సమ్మె చేయనున్నారు. ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులన్నీ మూత పడ్డాయి. తద్వారా లక్షలాది రూపాయలు విలువచేసే లావాదేవీలు నిలిచిపోయాయి. ఒకవైపు 13వ తేదీ రెండవ శనివారం, 14వ తేదీన ఆదివారం కాగా సోమవారం ఉద్యోగుల సమ్మెతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు తెరుచు కోలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.