కాజీపేట, మే 1: వరంగల్ నగరంలోని సంఘటిత, అసంఘటిత కార్మికులు శనివారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్ర జెండాలను ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. కాజీపేట రైల్వే జంక్షన్, పట్టణంలోని ముఖ్య కూడలి, ప్రభుత్వ, ప్రైవేట్, రైల్వే కార్యాలయాల్లో కార్మికులు ఎర్రజెండాను ఎగురవేని ‘మే డే వర్ధిలాలి’ అంటూ నినాదాలు చేశారు. రైల్వే జంక్షన్ పరిధిలోని డీజిల్ లోకో షెడ్ ప్రవేశ ద్వారం ఎదుట రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందనున్న వైఎస్ రావు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వేద ప్రకాశ్, గిరిమిట్ల రాజేశ్వర్రావు, అనుమాల శ్రీనివాస్, జానీ, శంకర్, రమేశ్ పాల్గొన్నారు.
కాజీపేటలో..
కాజీపేట చౌరస్తాలో పెయింటింగ్ వర్కర్స్, మేస్త్రీల యూనియన్ ఆధ్వర్యంలో మే డే వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్తలు మహేందర్, వెంకటేశ్వర్లు, సంఘం నాయకులు జలీల్, ప్రభాకర్, రబ్బానీ, రాజు, రాజ్కుమార్, దేవదాస్, ఐలేశ్, మల్లేశ్, లక్ష్మణ్, రామకృష్ణ, సురేశ్, భిక్షపతి, బషీర్, దాస్, కార్మికులు పాల్గొన్నారు. అలాగే బాపూజీనగర్ చౌరస్తాలో ట్రైసిటీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక అధ్యక్షుడు బండి రాంచందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు సిరిల్ లారెన్స్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం అన్నదానం చేశారు. కోశాధికారి వెంకటేశ్వర్లు, డీ శివకుమార్ పాల్గొన్నారు.
న్యూశాయంపేటలో..
న్యూశాయంపేట : న్యూశాయంపేట జంక్షన్లో గుమస్తా, ఆటో, భవన కార్మికుడు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల సారంగపాణి జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వర ఆటో డ్రైవర్, వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వేల్పుల సాంబమూర్తి, రాదారపు భాస్కర్, వేల్పుల సుధాకర్, పీ మోహన్ పాల్గొన్నారు.
వడ్డేపల్లి జంక్షన్లో..
నయీంనగర్: వడ్డేపల్లి జంక్షన్లో తాపీమేస్త్రీ, వర్కర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేడే నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు షేబేల్ జెండాను ఎగురవేశారు. మత్తయి, వెంకటయ్య, కట్టయ్య, మహేందర్, కోటి, సదానందం, కుమార్, మొగిళి పాల్గొన్నారు.