వలిగొండ, ఏప్రిల్ 17: మండల పరిధిలోని గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని సుంకిశాల గ్రామాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణ పనులు, డంపింగ్ యార్డు నిర్మాణం, నర్సరీలోని మొక్కలు, గ్రామంలోని సీసీ రోడ్లు, వీధిలైట్లు, గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గ్రామంలోని వీధులు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్, పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొగిలిపాక నర్సింహ్మ, ఎంపీడీవో గీతారెడ్డి, ఎంపీవో ఈశ్వర్, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం, చెరుకు శివయ్య పాల్గొన్నారు.
రికార్డులను పరిశీలించిన జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్17: చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.వార్షిక వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేసి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాకేశ్రావు ,జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ బండారు యాదగిరి, మండల సూపరింటెండెంట్ బంగారు విజయ్కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.