యాదాద్రి, అక్టోబర్28 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణ మహోత్సవం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్ర నామార్చన జరిపించారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. పురోహితులు అమ్మవారికి విశేష పూజలు శాస్ర్తోక్తంగా జరిపారు. శ్రీవారి ఖజానాకు రూ.9,86,509 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 85,112
నిత్యకైంకర్యాలు 400
రూ.100 దర్శనం టిక్కెట్ 32,500
వేద ఆశీర్వచనం 8,256
క్యారీబ్యాగుల విక్రయం 2,750
టెంకాయల విక్రయం 27,000
వ్రత పూజలు 28,500
కల్యాణకట్ట టిక్కెట్లు 15,000
ప్రసాద విక్రయం 3,90,830
వాహన పూజలు 8,300
టోల్గేట్ 790
అన్నదాన విరాళం 72,043
సువర్ణ పుష్పార్చన 55,600
యాదరుషి నిలయం 58,090
పాతగుట్ట నుంచి 12,230
గోపూజ 150
ఇతర విభాగాలు 1,04,694