సుదర్శన నారసింహహోమం.. స్వామివారి నిత్యకల్యాణం
శ్రీవారి ఖజానాకు రూ. 7,68,783
కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్న భక్తులు
యాదాద్రి, మార్చి 28: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలా లయంలో స్వామివారి నిత్యపూజలు అర్చకులు ఆంతరంగికం గా నిర్వహించారు. యాదాద్రి దేవస్థానంలో విధులు నిర్వహిం చే ఆలయ సిబ్బంది, అర్చకులకు కరోనా సోకడంతో స్వామి వా రికి జరిపిన వివిధ సేవల్లో భక్తులకు అనుమతి నిరాకరించారు. ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి నిత్యారా ధనలు, నిజాభిషేకంతో స్వామివారి ఆరాధనలు ప్రారంభించా రు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అ ర్చకులు లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి, పంచామృ తాలతో అభిషేకం హారతి నివేధనలు అర్పించారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ సుదర్శన నారసింహ హోమం జరిపారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిము ఖంగా అధిష్టించి సుమారు గంటన్నరకుపైగా కల్యాణ తంతు జరిపారు. సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తు లు అధికంగా తరలివచ్చారు. భక్తులు మాస్కులు ధరించి, భౌతి కదూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వ హించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. పర్వతవ ర్ధనీ సమేత రామలింగే శ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవ గ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చన లు నిర్వహించారు. లక్ష్మీ సమేతుడైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
స్వామివారికి భారీగా నిత్య రాబడి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి నిత్య రాబడి రూ. 7, 68,783 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 58,050, రూ.100 దర్శనాల తో రూ. 3,000, వీఐపీ దర్శనాలతో రూ. 53,250, కైంకర్యాల ద్వారా రూ. 200, ప్రచారశాఖ ద్వారా రూ. 3,350, వ్రతాలతో రూ. 48,000, కల్యాణకట్టతో రూ. 24,000, ప్రసాద విక్రయా లతో రూ. 4,57,060, శాశ్వత పూజలతో రూ.2,232, వాహన పూజలతో రూ. 9,000, టోల్గేట్ ద్వారా రూ. 380, అన్నదాన విరాళంతో రూ. 12,567, సువర్ణ పుష్పార్చనతో రూ. 6,708, యాద రుషి నిలయంతో రూ. 66,230, శివాలయం ద్వారా రూ. 1,416, పాతగుట్టతో రూ.12,340, ఇతర విభాగాలతో రూ.11,000తో కలిపి స్వామివారికి రూ.7,68,783 ఆదా యం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు.
మరో 32 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో విధుల్లో ఉన్న మరో 32 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. ఆది వారం కొండకింద తులసి కాటేజీ వద్ద శిబిరం నిర్వహించి 312 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని మండల వైద్యాధి కారి వంశీకృష్ణ తెలిపారు. 38మందికి కరోనా పాజిటివ్ వచ్చిన ట్లు, వీరిలో 32 మంది ఆలయ సిబ్బంది ఉండగా మిగతా ఆరు గురు పట్టణానికి చెందినవారని అన్నారు. దీంతో ఇప్పటివరకు యాదాద్రి ఆలయంలో కరోనా బాధితుల సంఖ్య 68కి చేరింది.
నిరాడంబరంగా వసంతోత్సవం
పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో మహాపవిత్ర రోజైన పాల్గుణ శుద్ధ పౌర్ణమి ఆదివారం వసంతోత్సవాన్ని కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. హోలీ పర్వదినాన్ని పురస్కరిం చుకొని లక్ష్మీనరసింహులను పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల అభరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమనోహరంగా ఆ లంకరించి బాలాలయం ఉత్సవ మండపంలో అధిష్టించి లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య స్వామి వారి వంస తోత్సవ సేవ జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు మాట్లాడుతూ యాదాద్రీశుడి వార్షిక బ్రహోత్సవాల అనంతరం నిర్వహించిన తొలి ముఖ్య మైన వేడుక వంసతోత్సవ పండుగ అని అన్నారు. ఈ సందర్భంగా వంసతోత్సవం, హోలీ పండుగ విశిష్టత వివరించారు.
ఇవి కూడా చదవండి
ఆత్మహత్య నుంచి ఇద్దరిని కాపాడిన కరీంనగర్ లేక్ పోలీసులు
స్లో ఓవర్రేట్.. టీమ్ఇండియాకు భారీ జరిమానా