భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 23: పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి వాటి చరిత్రను తెలిజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని గురువారం భువనగిరి ఖిల్లా సమీపంలో పర్యాటక ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పిల్లలకు, విద్యార్థులకు పర్యాటక ప్రాంతాలను చూపించి వాటి ఔన్నత్యాన్ని తెలియజేయాలన్నారు. పురాతన చరిత్ర గల కట్టడాలు, దేవాలయాలు, పర్యాటక కేంద్రాలను భావితరాలకు అందించాలంటే వాటిని తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక స్థలాలను కాపాడు కోవాలని, పిల్లలకు పర్యాటక రంగంపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, వారిలో కొత్త ఆలోచనలకు స్ఫూర్తినిచ్చేలా భాగస్వాములు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27 వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు భువనగిరి ఖిల్లాపై హెరిటేజ్ వాక్ నిర్వహించారు. హెరిటేజ్ టూర్, సైక్లింగ్, స్వచ్ఛా పక్వాడా, పర్యాటక రంగంపై సదస్సులను ఖిల్లా వద్ద నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ జిల్లా అధికారి కే.ధనంజనేయులు తెలిపారు. హైస్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో హెరిటేజ్ అధ్యక్షుడు సద్ది వెంకట్రెడ్డి, కన్వీనర్ దిడ్డి బాలాజీ, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, జిల్లా ఉపా ధి కల్పనాధికారి సాహితి, హెరిటేజ్ కమిటీ సభ్యు లు, అంజయ్య, వినోద్, జయశ్రీ పాల్గొన్నారు.