భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 22 : ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లి మరింత అభివృద్ధి చెందడానికి గౌరెల్లి నుంచి భద్రాచలం వరకు పోచంపల్లి మీదుగా జాతీయ రహదారి రాబోతున్నదని, దానికి సంబంధించిన పనులు డిసెంబర్లో ప్రారంభం కానున్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని గౌస్కొండ నుంచి గౌస్కొండ తండా, రామలింగంపల్లి, శివారెడ్డిగూడెం మీదుగా రెడ్డినగర్ వరకు ప్రధాన మంత్రి జాతీయ సడక్ యోజన నిధులు రూ.2.80 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డుపనులకు ఆయన జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం శివారెడ్డిగూడెం గ్రామం నుంచి వంకమామిడి రోడ్డు వరకు చిన్నేటిపై( మైమ్మ కత్వ కాల్వ) రూ. 6.3 కోట్లతో నిర్మించనున్న వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గౌరెల్లి ఓఆర్ఆర్ నుంచి భూదాన్పోచంపల్లి, వలిగొండ, తిరుమలగిరిల మీదుగా భద్రాచలం వరకు జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రూ. 2200 కోట్లు నిధులు విడుదల చేసిందని తెలిపారు. త్వరలో ఇంద్రియాల జంపల్లి గ్రామాల మధ్య మూసీపై వంతెన నిర్మాణం కూడా పూర్తి చేస్తామన్నారు. జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే శేఖర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల అభివృద్ధి వేగవంతమయ్యిందన్నారు. గౌరెల్లి-భద్రాచలం రోడ్డు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పంపడం మూలానే రోడ్డు అనుమతులు వచ్చాయని తెలిపారు. ఎంపీపీ ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశం యాదవ్, సిగిల్విండో చైర్మన్ భూపాల్రెడ్డి, లింగం యాదవ్, సర్పంచ్ మంజులామహిపాల్రెడ్డి, ఎంపీటీసీ ధర్మారెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు మాధవీశ్రీశైలం గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాధవరెడ్డి, సుధాకర్రెడ్డి, భిక్షపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్రెడ్డి, నాయకులు మల్లారెడ్డి, శేఖర్రెడ్డి, మహిపాల్రెడ్డి, దేవేందర్రెడ్డి, దంతూరు సర్పంచ్ కుమార్ పాల్గొన్నారు.
అనాజిపురం, సింగరేణికుంట,
బొల్లెపల్లిలో..
భువనగిరి అర్బన్ : మండలంలోని అనాజిపురం నుంచి నమాత్పల్లి వరకు రూ.3.10 కోట్లు, సిరివేణికుంట నుంచి నందనం వరకు రూ.2.65 కోట్లు, బొల్లెపల్లి నుంచి టేకులసోమారం వరకు రూ.1.90 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్లకు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, ఎంపీపీ నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ మల్లయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ప్రధానకార్యదర్శి ఓం ప్రకాశ్, రాఘవేందర్రెడ్డి, వీరేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
రెడ్లరేపాక.. సుంకిశాల మధ్య..
వలిగొండ :మండల పరిధిలోని రెడ్లరేపాక సుంకిశాల గ్రామాల మధ్య రూ.1.97 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ వెంకట్రెడ్డి ఎమ్మెల్యే శేఖర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంపీపీ రమేశ్రాజ్, జడ్పీటీసీ పద్మా అనంతరెడ్డి, సర్పంచ్ అరుంధతి, ఎంపీటీసీ మల్లేశం, టీఆర్ఎస్ నాయకుడు రాజవర్ధన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ కవిత, రైతు బంధు కన్వీనర్ మమత నరేందర్రెడ్డి, అధికారులు గిరిధర్, ఎంపీడీఓ గీతారెడ్డి, పీఆర్ఏఈ సుగుణాకర్రావు, ప్రసాద్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఏనుగు అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
3.11 కోట్లతో
బీబీనగర్, సెప్టెంబర్ 22 : మండలంలోని రాఘవాపురం, లక్ష్మీదేవిగూడెం, బ్రాహ్మణపల్లి గ్రామాల నుంచి ఎర్రబెట్టె తండా వరకు రూ.3.11 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శేఖర్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంపీపీ సుధాకర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జైపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ బస్వారెడ్డి, ఎంపీటీసీలు ఆండాలుఅశోక్, బాల్చందర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రవి కుమార్, ఎంపీడీఓ శ్రీవాణి, ఎంపీఓ స్వాతి, టీఆర్ఎస్ మండలాధక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.