శ్రీవారి ఖజానాకు రూ. 5,38,233 ఆదాయం
యాదాద్రి, సెప్టెంబర్22: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో బుధవారం స్వామివారికి నిత్యార్చనలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు పంచామృతాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పట్టువస్ర్తాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి నిజాభిషేకం, తులసీ అర్చనలు చేపట్టారు. లక్ష్మీ నరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన నారసింహహోమం, శ్రీలక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు వైభవంగా జరిపారు. సాయంత్రం నిత్యారాధనలు, అలంకార వెండి జోడుసేవలు, సహస్రనామార్చనలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ భవనంలో కొలువైన శివుడికి నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మంగా జరుపుకునే సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు బుధవారం రూ.5,38,233 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 53,206
రూ.100 దర్శనం టిక్కెట్ 28,000
వీఐపీ దర్శనాలు ———
వేద ఆశీర్వచనం 7,740
సుప్రభాతం 1,600
క్యారీబ్యాగుల విక్రయం 2,200
వ్రత పూజలు 16,500
కల్యాణకట్ట టిక్కెట్లు 10,000
ప్రసాద విక్రయం 3,03,335
శాశ్వత పూజలు 6,000
వాహన పూజలు 2,500
టోల్గేట్ 840
అన్నదాన విరాళం 1,332
సువర్ణ పుష్పార్చన 74,280
యాదరుషి నిలయం 19,700
పాతగుట్ట నుంచి 10,900
ఇతర విభాగాలు ——–