భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 20 : మహర్షి వాల్మీకి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణం భవిష్యత్ తరాలకు మార్గదర్శకమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్తివారీ, శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి, ఆర్డీఓ భూపాల్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదయ్య, ఏసీపీ వెంకట్రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్/ చౌటుప్పల్/ వలిగొండ/ రామన్నపేట/ అడ్డగూడూరు/ బీబీనగర్/ సంస్థాన్ నారాయణపురం : భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ బీరు మల్లయ్య, ఎంపీడీఓ నాగిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, కమిషనర్ ఎం.పూర్ణచందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు నివాళులర్పించారు. వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నూతి రమేశ్, ఎంపీడీఓ గీతారెడ్డి, తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ నాగలక్ష్మి, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించారు. రామన్నపేట తాసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల్లో వాల్మీకి చిత్రపటానికి ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, డీటీ ఇబ్రహీం, ఎంపీఓ ఆర్వీ సత్యనారాయణ, ఎంపీటీసీలు నివాళులర్పించారు. తాసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఎంపీడీఓ చంద్రమౌళి, డీటీ రుకుముద్దీన్, ఏపీఓ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. కార్యాలయంలో ఎంపీపీ సుధాకర్గౌడ్ ఎంపీడీఓ శ్రీవాణి నివాళులర్పించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వాల్మీకి సంఘం నాయకులు వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించారు.
ఆలేరు నియోజకవర్గంలో..
రాజాపేట/ఆలేరు రూరల్/తుర్కపల్లి/ఆలేరు టౌన్/ ఆత్మకూరు(ఎం) మహర్షి వాల్మీకి జయంతిని పురష్కరించుకొని రాజాపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, ఎంపీడీఓ రామరాజు పాల్గొన్నారు. మండలం గొలనుకొండ గ్రామంలో సర్పంచ్ బైరపాక లక్ష్మీరామచంద్రయ్య, ఉప సర్పంచ్ తండా మధు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. తుర్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీటీసీలు వనజ, హరినాయక్ పాల్గొన్నారు. ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్లు బేతి రాములు, జూకంటి శ్రీకాంత్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం, జూకంటి శంకర్, దాసి సంతోష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆత్మకూర్(ఎం) మండల పరిషత్ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ తండ మంగమ్మ, ఎంపీడీఓ ఆవుల రాములు, ఎంపీఓ పద్మావతి, ఏఓ శిల్ప, ఏఈఓ రాజశేఖర్ పాల్గొన్నారు.