యాదాద్రి, సెప్టెంబర్ 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హరిహరులకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. బాలాలయంలో కవచమూర్తలను సువర్ణపుష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి అర్చనలు చేశారు. అనంతరం సుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సోమవారం కావడంతో శివుడికి రుద్రాభిషేకం వైభవంగా జరిపించారు. కొండకింద గోశాల వద్ద వ్రత మండపంలో భక్తులు సత్యనారాయణ వ్రతమాచరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే క్యూ కట్టారు. దర్శనం అనంతరం ప్రీతికరమైన స్వామివారి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేశారు.
వసతి గృహాల వద్ద రోడ్ల పునరుద్ధరణ
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లు దెబ్బతినడంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. కొండకింద తులసీ కాటేజీ 100 పడకల వసతి గృహం వద్ద పాతరోడ్డును పూర్తిగా తొలగించి బీటీ వేశారు. ఈఓ, వివిధ విభాగాల కార్యాలయాలతోపాటు, వసతి గృహాలకు వచ్చే భక్తులకు ఇక ఏ సమస్యా ఉండదు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,27,714
రూ.100 దర్శనం టిక్కెట్ 13,400
వీఐపీ దర్శనాలు 36,750
వేద ఆశీర్వచనం 4,128
నిత్యకైంకర్యాలు 400
క్యారీబ్యాగుల విక్రయం 2,100
వ్రత పూజలు 42,500
కల్యాణకట్ట టిక్కెట్లు 19,400
ప్రసాద విక్రయం 4,20,080
వాహన పూజలు 9,900
టోల్గేట్ 890
అన్నదాన విరాళం 11,153
సువర్ణ పుష్పార్చన 64,340
యాదరుషి నిలయం 51,100
పాతగుట్ట నుంచి 24,900
ఇతర విభాగాలు 250
శ్రీవారి ఖజానాకు సోమవారం రూ.8,29,355
ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.