యాదాద్రి, సెప్టెంబర్ 19: యాదాద్రి శ్రీ లక్ష్మీసమేతుడైన నారసింహస్వామివారికి నిత్య ఆరాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆర్జిత పూజల కోలాహలం ఆదివారం తెల్లవారు జామున మూడు గంటలకు మొదలు కాగా సుప్రభాతం అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో స్వల్ప రద్దీ కొనసాగింది. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తరం జరిపించారు. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు రూ.15,15,405 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 2,41,626
రూ.100 దర్శనం టిక్కెట్ 11,300
వీఐపీ దర్శనాలు 1,80,000
వేద ఆశీర్వచనం 6,192
సుప్రభాతం 3,200
క్యారీబ్యాగుల విక్రయం 5,000
వ్రత పూజలు 61,000
కల్యాణకట్ట టిక్కెట్లు 37,600
ప్రసాద విక్రయం 6,51,105
వాహన పూజలు 18,500
టోల్గేట్ 2,350
అన్నదాన విరాళం 14,294
సువర్ణ పుష్పార్చన 1,36,000
యాదరుషి నిలయం 75,850
పాతగుట్ట నుంచి 33,200
ఇతర విభాగాలు 11,876
శ్రీవారి ఖజానాకు ఆదివారం రూ.15,15,405
ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.