యాదాద్రి, అక్టోబర్14 : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణ మహోత్సవం జరిపించారు. కొండపైన పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే శ్రీసత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. యాదాద్రి అనుబంధ బాలశివాలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. పురోహితులు అమ్మవారికి విశేషపూజలు చేశారు. శ్రీవారి ఖజానాకు రూ.3,50,456 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 40,782
రూ.100 దర్శనం టిక్కెట్ 19,000
నిత్యకైంకర్యాలు 800
వేద ఆశీర్వచనం 3,096
క్యారీబ్యాగుల విక్రయం 1,400
వ్రత పూజలు 8,000
కల్యాణకట్ట టిక్కెట్లు 6,200
ప్రసాద విక్రయం 1,37,960
వాహన పూజలు 10,116
టోల్గేట్ 430
అన్నదాన విరాళం 12,984
సువర్ణ పుష్పార్చన 64,140
యాదరుషి నిలయం 13,800
పాతగుట్ట నుంచి 7,650
టెంకాయల విక్రయాలు 15,000
గోపూజ 150