కరీమాబాద్, ఏప్రిల్ 16 : బాధితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వంగరి చందన తండ్రి వంగరి సురేశ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా బాధిత కుటుంబానికి మంజూరైన రూ.2లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే శుక్రవారం పెరుకవాడలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేడిది రజిత, మేడిది మధుసూదన్, పిన్న మల్లేశం, పార్వతీ కృష్ణంరాజు, శెట్టి రాజు పాల్గొన్నారు. కాగా, టీఆర్ఎస్ నాయకుడు బిల్లా పవన్ తండ్రి బిల్లా కుమార్ ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే నన్నపునేని పరామర్శించారు. 41వ డివిజన్ నాగేంద్రనగర్లోని సామిల్ టింబర్ డిపోలో మృతుడి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి ఉన్నారు.
చందూలాల్ మృతికి సంతాపం
వరంగల్ : మాజీ మంత్రి చందూలాల్ మృతికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సంతాపం తెలిపారు. చందూలాల్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేసినట్లు తెలిపారు. వివిధ హోదాల్లో పార్టీకి సైతం సేవలు అందించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కోరారు.
ఇవి కూడా చదవండి
సుదీప్ ప్రేక్షకుల ముందుకొచ్చే డేట్ ఫిక్స్..!
IPL 2021: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్