కరోనా కష్టకాలంలో అన్నదాతకు అండగా..
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సర్కారుసన్నద్ధం
ఉమ్మడి జిల్లాలో వెయ్యి కేంద్రాలు
ఉగాది తర్వాత ఊరూరా ప్రారంభం
వరంగల్రూరల్, ఏప్రిల్ 7 (నమస్తేతెలంగాణ): జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ప్రతి మండలాన్ని రెండు క్లస్టర్లుగా విభ జించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏడు సెక్టార్ల ద్వారా రైస్మిల్లులకు తరలించేందుకు నిర్ణయించారు. కొనుగోలు కేంద్రానికో అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తారని కలెక్టర్ హరిత వెల్లడించారు. ధాన్యం కొనుగోలును ఆయా మండలాల స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షించనున్నారు. కరోనా నేపథ్యంలో గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణ యించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో యా సంగి ధాన్యం కొనుగోలుకు అధికారులు కసరత్తు చేపట్టారు. తొలుత కలెక్టర్ హరిత కొద్దిరోజుల క్రితం అధికారులతో సమావేశం నిర్వహించి యాసంగి ధాన్యం కొనుగోలు ప్రణా ళికపై చర్చించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ సైతం ధాన్యం కొను గోలు ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. అధికారులు తయా రు చేసిన ప్రణాళిక అమలుకు ఆమోదం తెలిపారు. దీని ప్రకా రం ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారి ఇన్చార్జి బాధ్య తలు నిర్వర్తిస్తారు. మండలంలోని రెండు క్లస్టర్లలో ఒక క్లస్టర్ కు వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) క్లస్టర్ అధికారిగా ఉంటారు. కేంద్రం నిర్వాహకులు, ఇన్చార్జి, క్లస్టర్ అధికారి సమన్వయంతో మండల ప్రత్యేకాధికారి ధాన్యం కొనుగోలు ను పర్యవేక్షిస్తారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లే రైతులకు స్థానిక ఏఈవో కూపన్ జారీ చేస్తారు. ఈ నెల రెండో వారంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభం కానుంది. అంటే ఉగాది పండుగ తర్వాత ప్రారంభం కావచ్చని అధికా రులు వెల్లడించారు. మొదట రాయపర్తి, వర్ధన్నపేట, పర్వత గిరి మండలాల్లోని సెంటర్లలో ధాన్యం కొనుగోలు ప్రారం భానికి సన్నాహాలు చేస్తున్నారు.
సెంటర్ల పెంపునకు అవకాశం
యాసంగిలో జిల్లా రైతులు రికార్డు స్థాయిలో వరిని 1,19,676 ఎకరాల్లో సాగు చేశారు. యాసంగిలో ఇంత విస్తీర్ణంలో వరి సాగవడం జిల్లాలో ఇదే ప్రథమం. దీంతో ప్రస్తుత సీజన్లో 3,24,322 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబ డి వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో 50 వేల మెట్రిక్ టన్నులు స్థానిక వినియోగం, 74, 322 మెట్రిక్ టన్నులు రైస్మిల్లర్లు కొనవచ్చని భావిస్తు న్నారు. ఈ క్రమంలో మిగతా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందుకోసం గ్రామాల్లో 175 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే మరికొన్ని కేంద్రాలు పెట్టానున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు 50 లక్షల గన్నీ సంచులు అవసరంకాగా ఇప్పటికే 32 లక్షల సంచులు రెడీగా ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ భాస్కర్ తెలిపారు. గత వానకాలం సీజన్లో ప్రభుత్వం ఖరా రు చేసిన ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లే ప్రస్తుత యాసంగి ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్లులకు రవాణా చేస్తారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఎఫెక్ట్ : 12 నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత
త్వరలో పని ప్రదేశాల్లోనే కొవిడ్ టీకాలు..