నర్సంపేటరూరల్, ఏప్రిల్ 12 : గ్రామాల్లోని పేదలు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని రాజపల్లి సర్పంచ్ నామాల భాగ్యమ్మ, మాజీ ఎంపీటీసీ నామాల సత్యనారాయణ కోరారు. మండలంలోని రాజపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం వంద రోజుల పని దినాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూనె నర్మద, పంచాయతీ కార్యదర్శి రమ్య, వార్డు సభ్యు లు, కారోబార్ పాల్గొన్నారు.
ఉపాధి కూలీలు అప్రమత్తంగా ఉండాలి
వర్ధన్నపేట, ఏప్రిల్ 12 : ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఏపీవో నాగేశ్వర్తో కలిసి ఉపాధి కూలీలకు సూచనలు చేశారు. విధి గా మాస్కులు ధరించాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులు ప్రారంభం
పర్వతగిరి, ఏప్రిల్ 12: మండలంలోని రోళ్లకల్ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫాం పాండ్స్ పనులను ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్ సోమవారం సర్పంచ్ సాద్యానాయక్తో కలిసి ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఏపీవో సుశీల్కుమార్, పంచాయతీ కార్యదర్శి చిరంజీవి, టీఏ గణేశ్ పాల్గొన్నారు.
పూడికతీత పనుల పరిశీలన
దామెర, ఏప్రిల్ 12 : ఉపాధిహామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కాగితాల శంకర్ అన్నారు. మండలంలోని ల్యాదెళ్ల గ్రామంలో జరుగుతున్న చెరువు పూడికతీత పనుల ను ఎంపీపీ పరిశీలించారు. అనంతరం మాట్లాడు తూ.. వేసవిని దృష్టిలో పెట్టుకుని పని ప్రదేశాల్లో కూలీలు సేదతీరడానికి షెడ్స్ నిర్మించాలన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ను అందుబాటులో ఉంచుకోవాలన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
తైవాన్ గురించి చైనాకు అమెరికా హెచ్చరిక
నూతన ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తాం : ఎమ్మెల్సీ కవిత