దుగ్గొండి, ఏప్రిల్ 11 : రాష్ట్రంలో గ్రామాల ప్రగతికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన దుగ్గొండి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మీపురంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, పల్లె ప్రకృతి వనం, జీపీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పల్లెప్రకృతి వనంలో ప్రజాప్రతినిధులతో కలిసి సరదాగా తిరిగారు. అనంతరం నూతన జీపీ ఆవరణలో సర్పంచ్ పాండవుల సురేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. నర్సంపేట ప్రజల చిరకాల వాంఛ అయిన గోదావరి జలాలను పాకాల చెరువుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలా భద్రయ్య, పీఆర్ డీఈ ఇజ్జగిరి, ఏఈ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, ఎంపీటీసీ మామునూరు సుమన్, రైతు బంధు సమితి కన్వీనర్ బొమ్మగాని రవికుమార్ పాల్గొన్నారు. కాగా, మండలంలోని శివాజీనగర్లో అనారోగ్యానికి గురైన టీఆర్ఎస్ నాయకుడు మాలగాని సుబ్బారావును ఎమ్మెల్యే పరామర్శించారు. అలాగే, గ్రామ పార్టీ కార్యదర్శి బోళ్ల కుమారస్వామి తల్లి బోళ్ల అమృతమ్మ(70) అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ లింగంపల్లి ఉమారవీందర్రావు, టీజీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండెకారి రంగారావు తదితరులు ఉన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు సీఎం వరం
నర్సంపేట : నర్సంపేట ప్రాంత రైతులకు సాగునీటి ప్రాజెక్టులు సీఎం కేసీఆర్ వరమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సంపేట ప్రాంతంలో రైతులు, కూలీలు, కార్మికులు, వ్యాపారులు ఇంతకాలం ఎదురు చూసిన గోదావరి జలాలు, ఇరిగేషన్ కల సాకారమైందన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీటి భద్రత కల్పించామన్నారు. ఇరిగేషన్ సర్క్యూట్తో ఎక్కడ చూసినా గోదావరి జలాలు ఉండేలా ప్రణాళిక రూపొందించి, అమలు చేసినట్లు చెప్పారు. ప్రధాన వాగులపై చెక్డ్యాంలను నిర్మిస్తున్నామన్నారు. కాల్వలకు మరమ్మతులు చేయించడానికి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్కు రూ.240 కోట్లతో డీపీఆర్ అందించామని చెప్పారు. రాజకీయ పరమైన ఎన్నో అవాంతరాలను ఛేదించి, పాకాలకు గోదావరి నీటిని తీసుకురావడంతో తన జన్మ ధన్యమైందన్నారు. ఈ ఉగాది నుంచి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధా న్యం ఇస్తామన్నారు. నియోజకవర్గంలోని 179 గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్, మహబూబాబాద్ నాయకుడు మర్రి రంగారావు, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
లాక్డౌన్ లేదు.. కర్ఫ్యూ మాత్రమే : శివరాజ్ సింగ్ చౌహాన్
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి