స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య
ధర్మసాగర్, ఏప్రిల్ 2 : ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్, డీ1 ఉప కాల్వ అనుబంధంగా ఉన్న చివరి ఆయకట్టు వరకూ సాగు నీరు అందజేస్తామని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. శుక్రవారం ఆయన మెయిన్ కెనాల్, డీ1 ఉప కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా కాల్వలో చెట్లు పెరిగి, పూడిక ఉండడంతో చివరి ఆయకట్టు వరకు నీరు ఆలస్యంగా అందుతోందని స్థానిక రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనికి స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కెనాల్ కట్టకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలని ఆదేశించారు. దీంతో అధికారులు వెంటనే యంత్రం సాయంతో పనులు ప్రారంభించారు. దీంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. పక్షం రోజుల్లో కాల్వల కింద వేసిన పంటలు చేతికి వచ్చే అవకాశం ఉన్నందున చివరి దశలో పంటలకు నీటిని వదులుతున్నట్లు చెప్పారు. కాగా, ప్రత్యేక చొరవ తీసుకుని పనులను జిల్లా కోఆప్షన్ సభ్యురాలు జుబేదా లాల్మహ్మద్ దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
మండలంలోని ఎలుకుర్తి గ్రామానికి చెందిన గుండుఎల్లయ్య(55), జోగు సతీశ్(45) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే రాజయ్య పరామర్శించారు. వారికి ఆర్థికసాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోంపెల్లి కరుణాకర్, ఎంపీపీ నిమ్మ కవిత, సర్పంచ్ మదాసి అరుణ, మండల అధికార ప్రతినిధి గంగారపు ఆనందరావు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గుడివెనుక దేవేందర్, రాష్ట్ర నాయకుడు బొడ్డు ప్రభుదాసు, వైస్ ఎంపీపీ బండారి రవీందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదకుమార్, చైర్మన్ బేరే వీరన్న, సర్పంచ్ సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ రఘు, పిట్టల సత్యనారాయణ, కొలిపాక రమేశ్, మాజీ ఎంపీటీసీ జోగు శేఖర్, బేరే దేవేందర్, యాదగిరి, గాజుల సదానందం, చిర్ర కుమార్ అలాగే, జానకీపురంలో బీజేపీ నేత పోట్ల పాపిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా ఆయన మృతదేహంపై ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ కుర్సుపల్లి నవ్య, ఉప సర్పంచ్ రవిమోహన్రెడ్డి, నాయకులు కుర్సుపల్లి భిక్షపతి, జగన్మోహన్ రెడ్డి, చేరాలు, కొమురయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
కరోనా ఎఫెక్ట్.. ముంబై – అహ్మదాబాద్ తేజస్ ఎక్స్ప్రెస్ రద్దు
దేశంలో 6.75 కోట్ల డోసుల కొవిడ్ టీకా పంపిణీ