గీసుగొండ, ఏప్రిల్ 2 : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు లక్ష్మీనర్సింహస్వామి సతీసమేతంగా విశ్వనాథపురం గ్రామంలోని శివాలయానికి పారువేటకు చేరుకున్నారు. అక్కడ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామి వారిని అర్చకులు పల్లకీలో గ్రామంలో ఊరేగించారు. భక్తులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాయంత్రం నేరుగా కొమ్మాలలోని ఆలయానికి స్వామివారిని తీసుకొచ్చారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కాగా, బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరుగడానికి కృషిచేసిన వారికి ఈవో కమల, ఉత్సవ కమిటీ చైర్మన్ గడ్డమీది కుమారస్వామి, ఆలయ ఫౌండర్ శ్రీనివాసాచార్యులు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల అధికారుల సహాయ సహకారాలతోనే జాతర విజయవంతమైందని వారు తెలిపారు.
ఇవి కూడా చూడండి..
ఐదు నెలల పులి పిల్లను చంపిన పెద్దపులి
పుల్వామాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం