స్వరాష్ట్రంలోనే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల సంబురాలు అంబరాన్నంటాయి. ముఖ్య అతిథిగా వినయ్భాస్కర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్క రించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాప త్రాలు అందజేశారు. స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించారు. వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శించిన శకటాలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ తరుణ్ జోషి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్, ఆగస్టు 15: స్వరాష్ట్రంలోనే ఇంటింటికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ అన్నా రు. సోమవారం పోలీస్ పచేడ్ గ్రౌండ్లో జరిగిన హనుమకొండ జిల్లా స్వాతంత్య్ర దినోత్సవ వేడు కల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వా తంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుల ను ఆయన స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నా రు. స్వా తంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రో త్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు.
ప్రతి ఇంటికి తాగు నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో మిషన్ భగీ రథ పథకం ద్వారా రూ. 90 కోట్లతో జిల్లాలో 207 గ్రామా లకు రక్షిత తాగునీరు అందిస్తున్నామని అన్నా రు. రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టు బడి అందిస్తున్నారని అన్నారు. రెండు సీజన్లలో లక్షా 38,986 మంది రైతులకు రూ. 132 కోట్లు వారి ఖాతాలో జమ చేశామని అన్నారు. రైతు బీమా పథకం ద్వారా 2021-22లో 323 మంది రైతు కుటంబాలకు బీమా క్లెయిమ్ చేశా మని అన్నారు. 145 ధాన్యం కొనుగోళ్లు కేంద్రా లను ఏర్పాటు చేసి లక్షా 9వేల 999 మెట్రిక్ ట న్నుల వడ్లను రైతుల నుంచి కొనుగోలు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. పట్టణ ప్రగతి ద్వారా గ్రేటర్ కార్పొరేషన్ కు రూ. 179 కోట్లు మంజూరయ్యాయని తెలి పారు.
వాటితో చేపట్టిన 275 అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగతావి పురోగ తిలో ఉన్నా యని అన్నారు. నగర, పట్టణ ప్రజల జీవన ప్ర మాణాలు పెంపొందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటె డ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు చేపడుతు న్నామని చెప్పారు. పట్టణ ప్రగతి నిధులతో వైకుంఠధామాలు నిర్మిస్తున్నామని అన్నారు. పేద దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేస్తు న్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4119 మంది లబ్ధిదారులకు రూ.410 కోట్ల 55 లక్షలు ఇచ్చామన్నారు. దళిత రక్షణ నిధి కింద ఒ క్కొక్కరికి రూ. 20 వేల చొప్పున రూ. 7.79 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
ఈ ఏడాది లో ఇప్పటి వరకు 2193 ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగా యని, ఇది సర్కారు వైద్యంపై ప్రజల నమ్మకానికి నిద ర్శనమన్నారు. జిల్లాలో కరోనా మహమ్మారిని తరిమే సేందుకు 15-17 లోపు పిల్లలకు వంద శాతం, 12-14 సంంత్సరా ల పిల్లలకు మొదటి డోసు 109, రెండో డోసు 82 శాతం వేశామని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద 2022-23 సంవత్సరంలో 17 లక్షల 25 వేల పనిదినాలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 14 లక్షల 14 వేల పని దినాలు పని కల్పించామని అన్నా రు. రూ. 34 కోట్ల 70 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ కార్పొరే షన్ల ద్వారా రుణాలు మంజూరు చేశామన్నారు. మైనా ర్టీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ చదువుల కోసం ఒక్కొక్క రికి రూ. 20 లక్షల చొప్పున ఆరుగురికి అందించామ న్నారు. వెనుక బడిన తరగతుల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కా లర్షిప్ల కోసం 2022-23 సంవత్సరా నికి రూ.10. 57 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
రాష్ట్రంలో 24 గంటల అంతరాయం లేకుండా విద్యు త్ సరఫరా చేస్తున్నామని, ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనతే అన్నారు. స్వానిధి ద్వారా జిల్లాలో 21,023 మంది వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించామని అన్నా రు. 2022-23లో పట్టణ పరిధిలోని 172 స్వయం సహాయక సంఘాలకు రూ. 11.87 కోట్ల బ్యాంకు రుణాలు అందజేశామని అన్నారు. హరితహారంతో పల్లెలు, పట్టణాలు పచ్చదనం ప రుచుకుంటున్నాయని అన్నారు. కాకతీయ పట్ట ణాభి వృద్ధి సంస్థ ద్వారా రూ. 240 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. హృదయ్ పథకం ద్వారా రూ. 35 కోట్లతో చారి త్రక ప్రదేశాల అభివృద్ధి చేశామని అన్నారు. రూ. 58 కోట్లతో కాళోజీ కళా క్షేత్రం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలో 4,718 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు కాగా, 1477 పూర్తి చేశామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మిగతావి పూర్తి చేస్తామన్నారు.
జిల్లాకు కొత్తగా 23,600 పింఛన్లు మంజూ రయ్యాయని చీఫ్ విప్ వినయ్భాస్కర్ అన్నారు. 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు స్వాతం త్య్ర దినోత్సవం నుంచి ప్రభుత్వం అందజేస్తున్న దని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దాప ఆయన కొంత మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను అందజేశారు.
స్వాతంత్య్ర వేడుకలు అంబరాన్నంటాయి. తొ లిసారిగా హనుమకొండ జిల్లా ఏర్పాటయ్యాక స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో పోలీస్ పరేడ్ వీక్షించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంత రం స్వాతంత్య్ర సమరయోధులను శాలువాలతో సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్ల ను ఆయన చూశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో మెరుగైన సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. విధి నిర్వహణ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారు లకు పోలీస్ కమిషనర్ తరుణ్జోషి మెడల్స్ అం దించారు.
అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. స్వాతంత్య్ర వజ్రోత్స వాల సందర్బంగా జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన శకటం అందరినీ ఆకర్షించింది. అట వీ, వైద్య ఆరోగ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఎస్సీ కార్పొరేషన్ శాఖలు చేపడుతున్న పథకాలను వి వరిస్తూ శకటాలు ప్రదర్శించారు. ఇందులో వైద్య ఆరోగ్య శాఖ మొదటి స్థానం దక్కించుకుంది. రెండో బహుమతి జిల్లా గ్రామీణాభివృద్ధి, మూడో బహు మతి ఎస్సీ కార్పొరేషన్ శకటాలు గెలుచుకు న్నాయి.
మల్లికాంబ మనోవికాస కేంద్రం చిన్నా రులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్బాబు, మేయర్ గుండు సుధారాణి, డీసీసీ బీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంక టేశ్వర్లు, కుడా చైర్మన్ సుందర్ రాజ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.