వరంగల్, ఆగస్టు 15: సీఎం కేసీఆర్ మార్గదర్శకంతో వరంగల్ నగరాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా కార్యాలయం ఆవరణలో సోమవారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో ఆమె భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అంబరాన్ని అంటేలా నిర్వహిస్తోందని తెలిపారు. ఈనెల 8వ తేదీన ప్రారంభించగా 22 వరకు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
నగరంలో కోటీ 20 లక్షల జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేశామని వివరించారు. సీఎం కేసీఆర్ సహకారంతో వరంగల్ నగరాన్ని రూ.198.5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అందులో రూ.127.5కోట్లతో చేపట్టిన 367 పనులు పూర్తయ్యాయని, మిగతావి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, రెండు సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. స్మార్ట్సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
రూ.48.55కోట్ల స్మార్ట్సిటీ నిధులతో 62పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. స్వానిధి ద్వారా 27వేల వీధి వ్యాపారులకు రుణా లు అందించి మొదటి స్థానంలో నిలుపడం గర్వకారణమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా సీఎం కేసీఆర్ కొత్త పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్లు ముష్కమల్ల అరుణ, మరుపల్ల రవి, బస్వరాజ్ శిరీష, పల్లం పద్మ, అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, సిటీప్లానర్ వెంకన్న, కార్యదర్శి విజయలక్ష్మి, బల్దియా ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు గౌరీశంకర్ పాల్గొన్నా రు. కాగా, పబ్లిక్ గార్డెన్లోని టౌన్ హాల్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టౌన్ హాల్పై జాతీయ జెండాను ఎగురవేశారు.
పబ్లిక్ గార్డెన్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, సీపీ వెంకన్న, డిప్యూటీ కమిషనర్ జోనా, రవీందర్రెడ్డి, ఈఈ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
మట్టెవాడ: డివిజన్ రామన్నపేటలో పెద్దమోరీ వద్ద మేయర్ గుండు సుధారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, ఎండీ షఫీ,శ్రీరాముల సురేశ్, వాడిక నాగరాజు, రాచర్ల జగన్, ముప్పు సతీశ్, ఇల్లందుల శశిధర్, భీంరాజ్, ఆర్టీసీ కుమారస్వామి, రాచర్ల లక్ష్మణ్, మట్టెవాడ సారంగం, మట్టెవాడ కుమారస్వామి, ఎర్ర సారంగపాణి పాల్గొన్నారు.