జనగామ రూరల్, అక్టోబర్ 5 : దేశ రాజకీయాల్లో కేసీఆర్కు ప్రత్యేక స్థానం ఉంటుందని, దేశ సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ బాల్దె విజయా సిద్ధ్దిలింగం అన్నారు. బుధవారం మండలంలోని పెంబర్తిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్కు స్వాగతం పలుకుతూ సంబురాలు చేశారు. దేశ్కీ నేత కేసీఆర్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు.
తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, వాటిని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు రావడం వల్ల ప్రజల జీవన స్థితిగతులు మారుతాయన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు గౌరయ్య, రజాక్, పుప్పాల కరుణాకర్, బీరయ్య, కిషన్, యాదగిరి, కంత్రి కుమార్, మంద శ్రీను, రాములు, కృష్ణ, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిల్పూరు : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంపై హర్షం వ్యక్తం చేస్తూ బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూక్యా రమేశ్ నాయక్ అధ్వర్యంలో మండలంలోని చిన్నపెండ్యాల ప్రధాన చౌరస్తాలో పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశావ్యాప్తంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ బత్తుల రాజన్బాబు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ గడ్డమీది వెంకటస్వామి, తాళ్లపల్లి ఎల్లయ్య, గ్రామ అధ్యక్షుడు ఇల్లందుల హరిబాబు, నాయకులు ఎడ్ల మహిపాల్, గడ్డమీది మహేందర్, చుక్క రాజు, గడ్డమీది పరమేశ్వర్, సురేశ్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.