‘భారత రాష్ట్ర సమితి’ని ప్రకటించిన ఈ పండుగ రోజే దేశానికి నిజమైన దసరా.. సీఎం కేసీఆర్ పెట్టిన జాతీయ పార్టీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని స్పష్టం చేశారు.
‘భారత్ రాష్ట్ర సమితి’ని ప్రకటించిన ఈ పండుగ రోజే దేశానికి నిజమైన దసరా అని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని, దేశంలో గుణాత్మక పాలన కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. కేసీఆర్ వెంట వివిధ రాష్ర్టాల వారు నడుస్తారని, ఆయన దేశ పాలకుడైతే విప్లవాత్మక మార్పులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. మేధావి వర్గం కూడా కేసీఆర్ వెంటే ఉంటుందని, విజన్ ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. బుధవారం దసరా పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రకటించడంపై పలువురు తమ మనోగతాలను ‘నమస్తే’తో పంచుకున్నారు.
– మహబూబాబాద్, అక్టోబర్5(నమస్తే తెలంగాణ)
– మాలోత్ కవిత, ఎంపీ, బీ(టీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మహబూబాబాద్
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక్కడే ప్రత్యేక రాష్ట్రం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆయన జాతీయ రాజకీయాల్లో రాణిస్తారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన విధంగానే దేశాన్ని కూడా ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా. ఆయన వెంట మేము నడు స్తాం. బీఆర్ఎస్ ఇక జాతీయ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తుంది.
– డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
మరిపెడ, అక్టోబర్5: సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోను న్నాయి. 2001 ఏప్రిల్లో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి దశాబ్దంన్నర ఉద్యమ ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడ మే కాక కులవృత్తులను ఆదుకున్న ఘనత కేసీఆర్కే దక్కుతుంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేయడంతో దేశంలో సువర్ణాధ్యాయం మొదలైంది.
– మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్
రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఇదే తరహాలో రానున్న రోజుల్లో దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నా. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశ వ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు మాదిరిగానే దేశ ప్రజలు కూడా కేసీఆర్ను ఆశీర్వదిస్తారు. తెలంగాణలో అమలయ్యే పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదు. రాష్ట్ర , దేవ ప్రజల అండ, దీవెనలు ఉన్నంతకాలం కేసీఆర్కు ఎదురు లేదు.
-మలిపెద్ది శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, సర్పంచ్ నీర్మాల, దేవరుప్పుల మండలం
దేవరుప్పుల, అక్టోబర్5: తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సృష్టించిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కాగా, భారత్ను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలి పేందుకు మరోసారి సృష్టించిందే బీఆర్ఎస్ పార్టీ. ఆయన చరిత్ర సృష్టించ డం ఖాయం. పలు భాషలపై మంచి పట్టున్న కేసీఆర్ జాతీయ రాజకీయా ల్లో విజయం సాధిస్తాడనడంలో సందేహం లేదు. బీజేపీ ప్రభుత్వం పేదలను విస్మరిస్త్తోంది. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోంది. నిత్యావసర వస్తువులను సామాన్యులకు అందుబాటులో ఉంచడం లేదు. ప్రగల్బాలు ఎక్కువ, పనులు తక్కువ అన్న రీతిలో బీజేపీ పాలన సాగుతోంది. దేశపగ్గాలు బీఆర్ఎస్ చేతికి వస్తే తెలంగాణ మార్కు పాలన దేశానికి అందుతుంది. ముఖ్యంగా రైతుల అండ కేసీఆర్కు ఉంది. వారంతా ఐక్యమైతే ఏం జరుగుతుందో తెలిసిందే.
– బదావత్ వీరూనాయక్, పన్యానాయక్ తండా, పాల వ్యాపారి
రాయపర్తి, అక్టోబర్5: దేశంలో స్వార్థ పూరిత రాజకీయాలకు వేదికలుగా మారు తున్న పార్టీలను బీఆర్ఎస్ అనతి కాలంలో మట్టి కరిపించడం ఖాయం. సుమారు అరవై ఏండ్ల పాటు ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాటాలు జరిపిన తెలంగాణ ప్రజలను గమ్య స్థానానికి చేర్చిన ఘనత ఉద్యమ రథసారధి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకే దక్కింది. కేసీఆర్ సారథ్యంలో పురుడుపోసుకున్న బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. అన్నపూర్ణ అయిన భారతదేశంలో బంగారు పంట లు పండేందుకు బాటలు వేస్తుంది. సీఎం కేసీఆర్ సంకల్పానికి ముక్కోటి దేవతలు మద్దతుగా నిలుస్తారు.
– టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రాయిడి దుష్యంత్రెడ్డ
నర్సంపేట, అక్టోబర్5: దేశంలో ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటున్నారు. రాష్ట్రం లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై దేశ ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ అధి కారంలోకి వస్తే ప్రజలకు ఎంతో ఉపయో గంగా ఉంటుంది. తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్, సీఎం కేసీఆ ర్ వెంటే ఉంటారు. అనతి కాలంలోరాష్ట్రం అన్ని రంగాల్లో అభివృ ద్ధిని సాధించింది. అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. ఆయన జాతీయ రాజకీయాల్లో రాణించడం వల్ల ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారు.
– తేజావత్ శారద, జడ్పీటీసీ మరిపెడ
మరిపెడ, అక్టోబర్ 5: సాగు రంగానికి పునరుజ్జీవం పోసి రైతును రారాజు చేసిన ఘనత కేసీఆర్దే. ఆడబిడ్డల సంరక్షణ కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అంగ న్వాడీల ద్వారా పౌ ష్టికాహారం, ఉచిత సుఖ ప్రసవాలు, ఉన్నత విద్య, అణగారిన వర్గాల అభివృద్ధికి రూ. 10 లక్షలతో దళితబంధు, మత్య్స, చేనేత, గీత, గొల్లకురుమల సంక్షే మంతో పాటు గిరిజన బంధు, పల్లె పల్లెకు మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షితమైన శుద్ధి చేసిన తాగునీళ్లను అందజేస్తూ సుభిక్షమైన పాలన అందిస్తున్న ఆయన సేవలు దేశానికి అవసరం. కేసీఆర్ తోడ్పాటుతో దేశానికి అన్నం పెట్టె అన్నపూర్ణగా రాష్ట్రం నిలిచింది. రైతుల ఇండ్లు నేడు ధాన్యపురాశులతో కళకలాడుతున్నాయి.
– నవీన్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మహబూబాబాద్
మరిపెడ, అక్టోబర్ 5: తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి రాష్ర్టాన్ని సా ధించడంతోపాటు రాష్టాన్ని ప్రగతిప థంలో నడిపిన సీఎం కేసీఆర్ రాజకీయ చరిష్మా కలిగిన నేత. టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీగా అవతరించడం చారిత్రక అవసరం అని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించ నున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రారంభించడం పలు రాష్ర్టాలు సైతం స్వాగతించడం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం. సుస్థిరమైన పారదర్శకమైన అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం. తెలుగు రాష్ర్టాలతో పాటు బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. విభజన హామీలు నిర్ణీత కాలంలో పరిష్కరించాల్సి ఉన్నప్పటికి తాత్సారం చేస్తూ విభే దాలు సృష్టిస్తోంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తోంది.
– పోగుల లక్ష్మీనారాయణ, వ్యాపారి, ఏటూరునాగారం
ఏటూరునాగారం, అక్టోబర్ 5: కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్న విషయం పక్క రాష్ట్రాల వారు గుర్తించారు. గుణా త్మకమైన పరిపాలన రావాలి. ఆయనతో కలిసొచ్చే వాళ్లు కూడా ఉన్నారు. ఉంటారు. రాష్ట్రంలో, దేశంలో కూడా ఒకే పార్టీ ఉంటే తెలంగాణ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అనేక పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. వీటిని పొరుగు రాష్ర్టాల్లో కూడా అమలు చేసే అవకాశం వస్తుంది. అన్ని రాష్ర్టాల్లోని పేదలకు తెలంగాణ లాంటి పథకాలు అమలవుతాయి. మేధావులు అంతా కేసీఆర్తో కలిసి వస్తారని అనుకుంటున్నా. ప్రయత్నం తీవ్రంగా ఉండాలి. మన రాష్ట్రం నుంచి దేశాన్ని పాలించే వ్యక్తి వస్తే మనకు ఎంతో గర్వంగా ఉంటది. పొరుగు రాష్ర్టాల ప్రజలు కూడా కొత్తగా ఏర్పాటు చేసే బీఆర్ఎస్కు నీరాజనం పలికే అవకాశం ఉంది. వృద్ధులకు పెన్షన్లు, రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అంతటా కావాలి. రాజకీయాల్లో మార్పులే కాకుండా ఆర్థిక మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది.
– చింతకింది సురేశ్, బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్మెట
నర్మెట, అక్టోబర్ 5: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడంతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభి వృద్ధి చేసిన ఘనత ఆయనదే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభు త్వం పాలనలో విఫలమైంది. గ్యాస్, పెట్రో ల్, డీజిల్ ధరలను పెంచింది. నిత్యావసర సరుకులతోపాటు అన్ని ధరలు పెరుగడంతో సామాన్యులు జీవించడమే కష్టంగా మారింది. ఇలాంటి తరు ణంలో కేసీఆర్ సేవలు దేశానికి అవసరం. ఆయనను దేశ ప్రజలు ఆదరిస్తారు.
– సోదా రామకృష్ణ, పరకాల, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు
పరకాల అక్టోబర్ 5: ప్రస్తుతం దేశం లో క్లిష్ట పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దేశ ప్రజలకు భరోసా ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని స్థాపించిండు. ఉద్యమ నాయకుడిగా టీఆర్ఎ స్ను స్థాపించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్య మం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన చరిత్ర ఉన్న నాయకు డు కేసీఆర్. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు. దేశంలో పలు వర్గాల ప్రజలకు అండగా నిలినేందుకే బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని పెట్టిండు. బీజేపీ పాలనలో దేశంలో అనిశ్చితి నెలకొంది. దేశ సంపద కొంత మంది చేతుల్లోకి చేరి పేదరికం ఎక్కువైంది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో అనేక వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరంద రికి అండగా నిలిచి దేశ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం మాదిరిగా సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకు న్న నిర్ణయాలు అందరికీ ఉపయోగపడుతాయి. రానున్న రోజు ల్లో బీజేపీని ఎదురించేది సీఎం కేసీఆర్ మాత్రమే.
– రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్5: బీఆర్ఎస్తో దేశం లోని రైతుల భవిష్యత్ మారనుంది. దేశంలోని రైతు లను ఆదుకునేందుకు కేసీఆర్ రాష్ట్రంలోని రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతాడు. బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం విధించడంతో రైతులకు మద్దతు ధర రావ డం లేదు. కేసీఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి దేశంలోని రైతులు, పరిశ్రమలను అభివృద్ధిలోకి తీసుకువస్తాడు.
– మండల పార్టీ అధ్యక్షుడు పోలెపల్లి శంకర్రెడ్డి
ఐనవోలు, అక్టోబర్5: బీఆర్ఎస్ పార్టీ ప్రకటన ఒక మైలురాయిలా నిలుస్తుంది. కేసీఆర్ సుదీర్ఘ పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించారు. ఏడేళ్లలో బంగారు తెలంగాణ వైపు బాటలు వేశారు. దేశం లో ఉన్న పరిస్థితులు మారాలంటే ప్రధానిగా కేసీఆర్ కావాలి.