‘ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజల కోసం వరంగల్లో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణమవుతున్నది.. రెండు వేల పడకల సామర్థ్యంతో 24అంతస్తుల హాస్పిటల్ అందుబాటులోకి వస్తది.. వైద్యం కోసం హైదరాబాద్ పోవుడు కాదు.. అక్కడోళ్లే వరంగల్కు వచ్చేలా ఈ దవాఖానలో అత్యాధునిక సేవలుంటయ్..’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను సీఎం కేసీఆర్ శనివారం పరిశీలించారు. అంతకుముందు ములుగు రోడ్డులో ‘ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ హాస్పిటల్, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్’ను ప్రారంభించారు. అనంతరం కాలేజీ సమీపంలోనే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. సెంట్రల్ జైల్, కాకతీయ మెడికల్ కాలేజీ కలిపి 190 ఎకరాల్లో ఓరుగల్లులో మెడికల్ సిటీ రూపుదిద్దుకుంటున్నదని వెల్లడించారు. ములుగు జిల్లాలో వందశాతం హెల్త్ ప్రొఫైల్ పూర్తయిందని, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఏటూరునాగారంలోనూ డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
వరంగల్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సెంట్రల్ జైల్ ఆవరణ, కాకతీయ మెడికల్ కాలేజీ కలిపి వరంగల్లో 190 ఎకరాల్లో మెడికల్ సిటీ రూపుదిద్దుకుంటున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజల కోసం రెండు వేల పడకల సామర్థ్యంతో 24 అంతస్తుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సేవల కోసం హైదరాబాద్ వాళ్లే వరంగల్కు వచ్చేలాగా ఈ హాస్పిటల్ ఉంటుందన్నారు. ఈ మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను శనివారం సీఎం పరిశీలించారు. అంతకుముందు వరంగల్ నగర పరిధి ములుగు రోడ్డులో ‘ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ హాస్పిటల్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్’ను ప్రారంభించారు.
అనంతరం కాలేజీ సమీపంలోనే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్కు అనేక విద్యా సంస్థలు వచ్చాయన్నారు. వరంగల్లోనే తెలంగాణ రాష్ట్ర హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. ఆరోగ్యరంగంలో తెలంగాణ చకగా పురోగమిస్తున్నదని చెప్పారు. ఈ రంగంలో మనం అద్భుతాలు సాధించామని, మరింత సాధించాల్సి ఉన్నదన్నారు. గతంలో తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ రంగంలో ఎంబీబీఎస్ సీట్ల కోసం ఐదు మెడికల్ కాలేజీలే ఉండేవని, ప్రస్తుతం 17 మెడికల్ కాలేజీలు అయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలకు మెడికల్ కళాశాలలను మంజూరు చేసిందని, వాటిని వరుసగా ప్రారంభించుకుంటున్నామని చెప్పారు.
కొద్దిరోజుల్లో అన్ని కాలేజీల నిర్మాణం పూర్తవుందన్నారు. 2014లో తెలంగాణలో 2800 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 6500కు పెరిగిందని చెప్పారు. అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పూర్తయితే 10వేల మెడికల్ సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మున్ముందు వైద్య విద్య కోసం ఇకడి పిల్లలు రష్యా, చైనా, ఉక్రెయిన్కు పోయే పరిస్థితి ఉండదని, ఇక్కడే చదువుకోవచ్చని చెప్పారు. వైద్య విద్య పీజీ సీట్లు గతంలో 1150 మాత్రమే ఉండేవని, ఇప్పుడు మన రాష్ట్రంలో 2500 పీజీ సీట్లు ఉన్నాయని చెప్పారు.
తెలంగాణలో ప్రతి ఒకరికీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సంకల్పించామని, ప్రయోగాత్మకంగా సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో వందశాతం హెల్త్ ప్రొఫైల్ తయారుచేశామని వివరించారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు పూర్తయితే, ఏ వ్యక్తికి ఏరకమైన ఆరోగ్య సమస్య వచ్చినా నిమిషంలోనే వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు. హెల్త్ ప్రొఫైల్తో ప్రజలకు అవసరమైన వైద్యసేవలను డాక్టర్లు వెంటనే అందిస్తారని చెప్పారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలోనూ డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. అక్కడ డయాలసిస్ సేవలు కావాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ గతంలో కోరారని, దసరా తర్వాత ప్రారంభిస్తామని తెలిపారు.
ఇక్కడ మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్యే సతీష్కుమార్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి ఉన్నారు. కార్యక్రమాల్లో మంత్రులు తన్నీరు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాసర్, ఎంపీలు జోగినపల్లి సంతోష్కుమార్, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, నవీన్కుమార్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, వొడితెల సతీష్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, టీ.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ల చైర్మన్లు బండ శ్రీనివాస్, మెట్టు శ్రీనివాస్, కే వాసుదేవారెడ్డి, బొల్లం సంపత్ కుమార్, వై.సతీష్రెడ్డి, ప్రతిమ గ్రూస్ సంస్థల చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు గోపి, రాజీవ్గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, ప్రతిమ హాస్పిటల్స్ డైరెక్టర్లు డాక్టర్ ప్రతీక్, డాక్టర్ హరిణి, డాక్టర్ రమేశ్, డాక్టర్ అవినాష్, డాక్టర్ రాహుల్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
వరంగల్ పర్యటనకు వస్తున్న జన నేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు అడుగడుగునా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లాలోని జనగామలో ప్రవేశించింది మొదలు వరంగల్ వచ్చేవరకు దారి పొడవునా తీరొక్క రంగుల పూలు, ‘దేశ్కీ నేత కేసీఆర్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కనిపించారు. పెంబర్తి స్వాగత తోరణం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మంత్రి ఎర్రబెల్లిని సీఎం తన కాన్వాయ్లో ఎక్కించుకొని వెళ్లారు. జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి, దేవరుప్పుల.. ఇలా అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అంతటా కోలాహలంగా కనిపించింది. ప్రతిమ హాస్పిటల్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సీఎంను సాదరంగా స్వాగతించారు.
వరంగల్ చౌరస్తా : రూ.1100 కోట్లతో 24 అంతస్తులతో వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో కడుతున్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. విభాగాల వారీగా ఏర్పాటు చేసిన నమూనాల గ్యాలరీని చూశారు. నిర్మాణంలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికతను రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రకృతి విపత్తులను తట్టుకునేలా పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణం ఉండాలని, హాస్పిటల్కు తగిన విధంగా సౌకర్యాలు ఉండాలని, ఖర్చుకు వెనుకాడకుండా, ఎక్కడా రాజీపడకుండా పనులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యశాల పునాధి కట్టిన విధానాన్ని సంస్థ ఇంజినీరింగ్, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు సీఎంకు వివరించారు.