నర్సంపేట, అక్టోబర్ 1 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నియోజకవర్గంలోని 700 మందికి రూ. 7 కోట్ల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఒక్క నర్సంపేట నియోజకవర్గంలోనే పది వేల మందికి చెక్కులను అందించామని తెలిపారు.
లబ్ధిదారుల సంఖ్య పది వేలకు చేరుకోవడంతో కల్యాణ బతుకమ్మ సంబురాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి ఏటా కల్యాణ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు. కాగా, మార్కెట్ యార్డు స్థలంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.