ట్రాఫిక్ పోలీస్ లేడని వాహనదారులు దర్జాగా దూసుకెళ్తున్నారా.. హెల్మెట్ లేకుండా వెళ్తున్నారా.. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారా.. మైనర్లు వాహనాలు నడుపుతున్నారా.. ఎవరూ తమను గుర్తించడం లేదని అనుకుంటే పొరబడినట్లే.. కూడళ్లపై అత్యాధునిక సీసీ కెమెరాలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. ఏ మాత్రం నిబంధనలు పాటించకపోయినా క్లిక్మనిపిస్తాయి. ఆటోమేటిగ్గా ఫొటో తీసి వాటిని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరవేస్తాయి. అక్కడ నుంచి వాహనం నంబర్ ఆధారంగా యజ మానికి జరిమానా విధిస్తారు. అప్రమత్తంగా లేకపోతే వాహనదారుల జేబులకు చిల్లులు పడే అవకాశం ఉంది.
మహబూబాబాద్, సెప్టెంబర్ 28: మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనులపై పోలీ సులు నిఘా పెట్టారు. నిబంధనలు అతిక్రమించిన వా రిపై అత్యాధునిక సాంకేతిక కెమెరాలతో పర్యవేక్షించి, జరిమానాలు విధిస్తున్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాలతో పట్టణంలోని నెహ్రూ, ఇందిరాగాంధీ, మూడు కొట్ల, మదర్థెరిసా, వివేకానంద, వైఎస్సార్ సెంటర్, నర్సంపేట బైపాస్ రోడ్డులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద పోలీ సులు, ట్రాఫిక్ సిబ్బంది నిత్యం విధులు నిర్వర్తిస్తూ వా హనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించడంతో పాటు అతిక్రమించిన వారికి సెల్ ఫోన్లో ఫొటోలు తీసి ఈ-చలాన్ల కింద జరిమానాలు విధించే వారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఎందుకంటే 100 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తే ఎలాంటి రక్షణ కలుగు తుందో అంతకు ఎక్కువ రెట్ల రక్షణతోపాటు వారిని పసిగట్టే సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవే ఆటోమెటిగ్గా ఫొటోను క్యాప్చర్ చేసి వాటిని మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్కు చేరవేస్తాయి. అక్కడ నుంచి వాహన నంబర్తో యజ మానికి జరిమానాను విధిస్తారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంతోపాటు అన్ని పో లీస్స్టేషన్ల పరిధిలో ఇలాంటి అత్యాధునికమైన సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేసి వాహనదారుల రాకపోకలపై నిఘా ఉంచారు. హెల్మెట్, నంబర్ లేని, ట్రిపుల్ రైడింగ్.. తదితర నిబంధనలు పాటించని వా హనదారులను జంక్షన్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమె రా లు తమ గుప్పిట్లో బంధిస్తాయి. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్కు చేరవేయడంతో సంబంధిత పోలీ సు అధికారులకు సమాచారం అందుతుంది. దీంతో వారికి జరిమానాలు విధిస్తారు. పీడీఎస్ బియ్యం, గుట్కాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలు రవా ణా చేసే వారిని పోలీసులకు పట్టించడంలో ఈ సీసీ కెమెరాలు సహాయపడుతాయి.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే సరి.. లేదంటే వారికి జరిమానాలు తప్పవు. జంక్షన్లలో ట్రా ఫిక్ పోలీసులెవరు లేదని రూల్స్ అతిక్రమిస్తే సీసీ కెమె రాలు వాటి పని అవి నిర్వర్తిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా సీసీ కెమెరాల పనితీరుపై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.