తొర్రూరు, సెప్టెంబర్ 28: రాష్ట్రంలో షూటింగ్ బాల్ క్రీడకు గుర్తింపు తెస్తానని, ఈ క్రీడల్లో రాణించిన క్రీడా కారులకు ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ వర్తింపజేసేలా సీఎం కేసీఆర్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో చర్చిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. తొర్రూరులోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో షూటింగ్ బాల్ అసోసియే షన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 41వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాలబాలికల షూటింగ్ బాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి యు వకులు, విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తయారు చేయడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ రూపకల్పన కోసం కృషి చేస్తోందని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వివిధ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు.
తొర్రూరులో రెం డు నుంచి మూడెకరాల స్థలాన్ని గుర్తించి వారం రోజుల్లో స్టేడియం నిర్మాణానికి కార్యాచరణ మొ దలు పెడుతామని ప్రకటించారు. తాను విద్యార్థి దశ నుంచి కబడ్డీ, వాలీబాల్, స్విమ్మింగ్ వంటి క్రీడలతోపాటు ఎన్సీసీలో ప్రావీణ్యత చూపి అ నేక బహుమతులను సాధించానన్నారు. అప్పు డు నేర్చుకున్న పరిపక్వత నేటి రాజకీయ జీవితంలో ఎంతో దోహద పడిందని చెప్పారు. క్రీడలతో ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం పెం పొంది చదువులోనూ రాణించేందుకు దోహదపడుతాయని, గెలుపోటములను సహజంగా తీసుకోవాలని చెప్పారు. ప్రతి రోజూ ఉదయం నడక ద్వారా బీపీ, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణ లో ఉంటాయన్నారు.
తొర్రూరులో రాష్ట్ర, జాతీ య స్థాయి క్రీడలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జయాపజయాలు క్రీడల నుంచే నేర్చుకుంటామని, వీటి ద్వారానే మన వ్యక్తిత్వం బలపడుతుందన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయని, క్రికెట్ కంటే ఇతర క్రీడలకు ఆదరణ పెరుగుతోందని, త్వరలోనే తొర్రూరులో స్టేడియం నిర్మాణానికి తగిన కార్యాచరణ మొదలుపెడుతామని చెప్పారు. ఎస్పీ శరత్చంద్ర పవా ర్ మాట్లాడుతూ క్రీడలు ఓటమిని, వైఫల్యాలను అంగీకరించడం నేర్పిస్తాయని, ఆరోగ్యానికి సహకరించి మానసిక ఒత్తిడిని తగ్గించే ఏకాగ్రతను పెంచుతాయని, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతాయని చెప్పారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎల్ రమేశ్, డీఎస్పీ వై రఘు, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్రెడ్డి, రైతుబంధుమండల కో-ఆ ర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్రెడ్డి, మండల, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, రామిని శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్హై, జిల్లా క్రీడా విభాగ అధికారి అనిల్, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, సీఐ వై సత్యనారాయణ, ఎస్సై సతీశ్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల షూటిం గ్ బాల్ పోటీల్లో 28 జిల్లాలకు చెందిన జట్లు పా ల్గొంటుండగా, 672 మంది క్రీడాకారులు, 100 మంది క్రీడాధికారులు విచ్చేశారని షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మంగళపల్లి శ్రీనివాస్, చెడుపాక ఐలయ్య తెలిపారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ క్రీడల్లో మంచి నైపుణ్యం కనపరిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టు పక్షాన త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు.