ఆడబిడ్డల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పర్వతగిరి మండలం ఏనుగల్లులో బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహిళలకు ప్రభుత్వ సారె బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ పండుగలకు విశ్వవ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశంలోనే ముందువరుసలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.
కాశీబుగ్గ, సెప్టెంబర్ 28 : నిరుపేదల అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవారం 3వ డివిజన్లోని ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ఆడబిడ్డల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమ ఫలాలు అం దుతున్నాయన్నారు. 3వ డివిజన్ పరిధిలో 4,800 మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రూ.4కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, రైతు వేదిక తదితర అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జన్ను షీభారాణి, హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితా యాదవ్, మాజీ కార్పొరేటర్ వీరభిక్షపతి, మాజీ సర్పంచ్ కంది రాజేందర్, డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, పండుగ రవీందర్రెడ్డి, బుడ్డె శ్రీనివాస్, ఉస్మాన్ అలీ, ఇట్యాల శిరీషాసతీశ్, బుద్దె వెంకన్న, వీర యాకూబ్, కిశోర్ గౌడ్, బొల్లం విజయ్, సిలువేరు విజేందర్ పాల్గొన్నారు. 14వ డివిజన్ సుందరయ్యనగర్ పాఠశాలలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తూర్పాటి సులోచన, డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ, నాయకులు తూర్పాటి సారయ్య, కేతిరి రాజశేఖర్, పత్రి సుభాశ్, గండ్రాతి భాస్కర్, పత్రి రాజపోషాలు, పసులాది మల్లయ్య, గంధం గోవింద్, పస్తం యాదగిరి, సిలువేరు శ్రీనివాస్, ఈర్ల రాజేందర్, భూక్యా శంకర్నాయక్ పాల్గొన్నారు. డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
3వ డివిజన్ కొత్తపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇసంపల్లి దాసు సహా 50 మంది టీఆర్ఎస్ చేరారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానన్నారు. పార్టీలో చేరిన వారు యూత్ అధ్యక్షుడు ఎడ్ల చిరంజీవి, ప్రధాన కార్యదర్శి సుధీర్, పాణిగౌడ్, ప్రవీణ్, శ్రవణ్, శోభ, సరస్వతి, అన్నపూర్ణ ఉన్నారు. అలాగే కొత్తపేటలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. రైతు వేదిక భవనం ప్రారంభించి బతుకమ్మ చీరల పంపిణీ చేశారు.
పర్వతగిరి : తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ప్రపంచంలోనే ప్రకృతిని ఆరాదించే సంస్కృతి ఉన్న ప్రాంతం తెలంగాణ మాత్రమేనన్నారు. మండలంలోని ఏనుగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహావిష్కరణ, బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్ల గు ర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగకు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా గుర్తింపు రావడం గర్వంగా ఉందని వెల్లడించారు. మన సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు.
అనంతరం ఏనుగల్లో రూ.3 లక్షలతో నిర్మించిన గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడారు. అంతకుముందు ఏనుగల్లు గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను భారీ గజమాలతో సత్కరించారు. బతుకమ్మలు, కోలాటాలు, డప్పు చప్పు ళ్లు, కళాకారుల నృత్యాలతో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్, ఎంపీపీ కమ ల, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్గౌడ్, గొర్రె దేవేందర్, సర్పంచ్ సంధ్యారాణి, ఎంపీటీసీ కోల మల్లయ్య, భూక్యా భాస్కర్, మాజీ సర్పంచ్ భాస్కర్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యుగేంధర్రావు, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు గూడ నరేందర్వర్మ, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, నర్సింగం, బాలరాజు, డాక్టర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.