మహబూబాబాద్, సెప్టెంబర్ 25 : అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం లో ఆమె 44 మంది లబ్ధిదారులకు రూ.19.78లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు.
మారుమూల ఏజెన్సీ గ్రామాల ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందేలా జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసిందన్నారు. నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. జిల్లా వైద్యశాలను కూడా అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు. జిల్లా వైద్యశాలలో ఇప్పటికే డయాగ్నొస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. కిడ్నీ రోగులకు డయాలసిస్ చేసేందుకు అత్యాధునిక మిషన్ అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బయ్యారం ఎంపీపీ మౌనిక, సీనియర్ నాయకులు పర్కాల శ్రీనివాస్రెడ్డి, ముత్యం వెంకన్న, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్పాషా, భూక్యా ప్రవీణ్, రాము, రాజూనాయక్, మూడు మోహన్, పొన్నాల యుగేంధర్, బానోత్ రాము పాల్గొన్నారు.