‘పల్లెల్లో అభివృద్ధి సంగతి అటుంచి బతుకుదెరువు కరువై ఆగమైన కులవృత్తులకు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవం పోశారు. ఆ కులం, ఈ కులం అనే తేడా లేకుండా అన్ని వృత్తులవారికి సరికొత్త పథకాలతో ఉపాధి చూపి బతుకు భరోసా ఇవ్వడమే కాదు.. రాజకీయంగానూ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, తదితర పదవులిచ్చి సముచిత స్థానం కల్పించారు.’ అందరి మేలు కోరే కేసీఆర్ వంటి నాయకుడి వల్లే దేశంలోని అన్ని కులవృత్తిదారులకు మంచిరోజులు వస్తాయని కుల సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. పల్లెలు బాగుంటేనే రాష్ట్రం, అలాగే దేశం అభివృద్ధి చెందుతుందని.. అది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని తేల్చిచెబుతున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 25
పల్లెల్లో ఆగమైన కులవృత్తులకు జీవం పోసి అనేక సంక్షేమ పథకాలతో వారికి చేయూతనిచ్చి ఆర్థిక భరోసానిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్తో దేశం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందని కుల సంఘాలు నాయకులు స్పష్టం చేశారు. దేశాన్ని ఇప్పటివరకు పాలించిన వారెవరూ అభివృద్ధిని, ప్రజలను గాలికొదిలేశారని.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వల్లే కులవృత్తులు మళ్లీ జీవంపోసుకొని పల్లెలు కళకళలాడుతున్నాయని చెబుతున్నారు. గీత, నేత, గొల్లకుర్మ, నాయీబ్రాహ్మణ.. ఇలా ఏ ఒక్క వర్గానికే కాకుండా అందరినీ అక్కున చేర్చుకున్న గొప్ప మనసున్న కేసీఆరే ప్రస్తుతం దేశానికి కావాలని అన్ని రాష్ర్టాల వారు కోరుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి నాయకుడు జాతీయ స్థాయిలో ఉంటేనే దేశంలోని అన్ని వర్గాలకు తెలంగాణ తరహా సంక్షేమ పథకాలతో కొండంత భరోసా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
సంగెం, సెప్టెంబర్ 25 : యాదవులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించింది కేసీఆరే. తెలంగాణ వచ్చిన తర్వాతే అన్ని కులవృత్తులకు జీవం వచ్చింది. యాదవులు, కురుమలకు మంచి అవకాశాలను కల్పించిండు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ గొర్రెలు ఇచ్చి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటునిచ్చారు. అలాగే ఐదుగురికి ఎమ్మెల్యే, ఒకరికి మంత్రి పదవి ఇచ్చి యాదవులు ఎదిగేందుకు కృషిచేసిన నాయకుడు. కుడా చైర్మన్గా సుందర్రాజ్ యాదవ్కు అవకాశం కల్పించి యాదవుల మనస్సు గెలుచుకున్నారు. ఇలా ఒక్క కులానికి కాదు.. అందరి శ్రేయస్సు, ఎదుగుదల కోసం పాటుపడుతున్నారు. ఇలాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశంలోని అన్ని కులాల వారికి సంక్షేమంతో పాటు సముచిత గౌరవం దక్కుతుంది.
– బొల్లెబోయిన కిషోర్యాదవ్, అఖిలభారత యాదవ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు
జనగామ చౌరస్తా, సెప్టెంబర్ 25 : మా నేతన్నలకు సీఎం కేసీఆరే ధీమా. ఇదివరకు ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో చేనేత కార్మికులకు పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే. మా కష్టాలు తీర్చి, కన్నీళ్లు తుడిచారు. త్రిఫ్టు పథకం తో ప్రతి కార్మికుడి కుటుంబం ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నది. అంతేగాక ‘నేతన్నకు బీమా’ పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి, ఆ కుటుంబం వీధిపాలు కాకుండా కొండంత భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ఇలా ఒక్క వర్గానికి కాకుండా అందరికీ మేలు చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉండాల్సిందే. గుజరాత్, సూరత్లో ఉన్న మా తోటి కార్మికులు కేసీఆర్ దేశానికి కావాలని మాకంటే బలంగా కోరుకుంటున్నారు. తెలంగాణ తరహా పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలైతే అన్ని కులవృత్తుల వారు బాగుపడుతారు.
– వేముల బాలరాజు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు, జనగామ
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 25 : దేశాన్ని ఇప్పటివరకు పాలించిన వారెవరూ రాష్ర్టాల అభివృద్ధిని గానీ, కులవృత్తులను గానీ పట్టిం చుకోలేదు. తెలంగాణ రాకముందు పల్లెల్లో కులవృత్తుల వారు ఉపాధి లేక బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లేవారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ చొరవతోనే కులవృత్తులు బాగుపడ్డాయి. ఏ వృత్తి వారికి ఏం కావాలో అడుగకముందే పథకాలు పెట్టి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. అన్ని కులాలను ఆదకున్నట్లే మా ముదిరాజులకు ఏటా ఉచితంగా చేప పిల్లలు, వలలు, ద్విచక్ర వాహనాలు, ఫోర్వీలర్లు అందిస్తూ అన్ని విధాలా భరోసా ఇచ్చారు. ఎనిమిదేళ్లలో తెలంగాణను ప్రగతి పథంలో నిలిపిన వ్యక్తి.. జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగలడు. తెలంగాణ వలె అన్ని రాష్ర్టాల వృత్తిదారులకు మంచిరోజులు వస్తాయి.
– మునిగల వెంకన్న, మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు, స్టేషన్ ఘన్పూర్
కేసముద్రం, సెప్టెంబర్ 25: దేశ సంపద, వనరుల లభ్యతను ఎలా ఉపయోగించాలో తెలిసిన వ్యూహకర్త. అన్ని రంగాల్లో పట్టు కలిగిన నాయకుడు . కుల వృత్తులకు ఆదరణ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వాటికి పూర్వ వైభవం తీసుకువచ్చాడు. కులాల వారీగా పథకాలు అమలు చేస్తూ ఆయా వర్గాల వారికి ఉపాధి చూపించారు. పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆర్థికంగా ప్రయోజనం కలిగిస్తున్నాయి. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అన్ని కులాల వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. ఆయన ప్రధాని అయితే దేశం అభివృద్ధి, ఉపాధి రంగాల్లో పరుగులు పెడుతుంది.
– ఘనపారపు రమేష్, శాలివాహన సంఘం రాష్ట్ర నాయకుడు
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 25: దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అనుభవశాలి అవసరం. తెలంగాణను అత్యంత బలమైన రాష్ట్రంగా నిలబెట్టారు కేసీఆర్. ఏ రాష్ట్రంలో లేనివిధంగా వివిధ సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. ఆయన అనుభవం, నాయకత్వాన్ని ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక్కడి పథకాలు దేశం మొత్తం విస్తరించాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి తప్పనిసరిగా రావాలి. దేశం ఎదురొంటున్న వివిధ సమస్యలను పరిషరించడానికి ఆయనే సరైన వ్యక్తి.
– సింగారపు శ్యామ్, నాయీబ్రాహ్మణ యువసేన జిల్లా అధ్యక్షుడు, హనుమకొండ
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 25: సమర్థుడితోనే దేశప్రగతి సాధ్యం. అసాధ్యమనుకున్న ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన గొప్ప మేధావి కేసీఆర్. ప్రజల కష్టాలు తెలిసిన నేత, కార్మిక పక్షపాతి. ఆయన రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను తమకూ కావాలని జాతి యావత్తూ కోరుకుంటోంది. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడం చరిత్రలోనే మైలు రాయిగా నిలిచిపోతుంది. ఈ ప్రాంత ప్రజలకు వరం. రాష్ట్రంలోని దళితబంధు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు.. ఇలా ఎన్నో తమకు అందుతాయని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
– తాటి సత్యనారాయణ, పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, హనుమకొండ
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 25: కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ప్రపంచ పటంలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం ఖాయం. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా, రైతుబంధు, ఉచిత కరంటు, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రైతు బాంధవుడిగా మారారు. అన్ని కులాలు, మతాలను ఏకతాటిపై తీసుకొచ్చి సమన్యాయం చేస్తున్నారు. దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసే సత్తా కేసీఆర్కే ఉంది. మూడు, నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడే నాయకుడు. ఆయన రాజకీయాల్లో వస్తే భారత్ వెలిగిపోతుందనడంతో సందేహం లేదు
– యేశబోయిన సాంబయ్యయాదవ్, సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు