కృష్ణకాలనీ, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇటీవల బుర్ర రమేశ్గౌడ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భారత్ ఫంక్షన్ హాల్లో అభినందన సభ జరిగింది. తొలుత జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుంచి డప్పుచప్పుళ్లు, ఒగ్గు వాయిద్యాలు, మహిళల కోలాటాల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వాయి జయంతి రోజు జిల్లాలోని గౌడ కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామనే హామీ మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి బుర్ర రమేశ్ను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారని తెలిపారు. గౌడన్నలు కల్లు మండువాలే వేదికలుగా ప్రతిపక్షాలను ప్రశ్నించాలని కోరారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం గౌడ కులస్తుంతా ఏకమై గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో భూములకు ధరలు పెరిగాయని, రైతులు తమ భూముల్లో గతంలో ఎన్నడూ వేయని పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. జిల్లాకు మరో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైందని వెల్లడించారు. కష్టపడి పనిచేసిన వారికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్లలో డైరెక్లర్లుగా నియమించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఏడాదిలోగా రూ.2కోట్లతో మోడల్ జిల్లా గ్రంథాలయ కార్యాలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ జడ్పీ చైర్ పర్సన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాట్లాడుతూ పదవులు ఎవరికి వచ్చినా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. కష్టపడి పనిచేసిన వారిని పార్టీ అధిష్టానం గుర్తించి పదవులు ఇస్తుందని తెలిపారు.
భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జెడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభా రఘుపతిరావు, టీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షుడు కటకం జనార్థన్పటేల్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, భూపాలపల్లి ఎంపీపీ మందల లావణ్య విద్యాసాగర్రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు హింగే మహేందర్జీ, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, గులాం అఫ్జల్, గౌడ సంఘం నాయకులు, బీబీచారి, మేనం రాజేందర్, అశోక్, బుర్ర సదానందం, రాజేశ్, కుమార యాదవ్, తిరుపతి, అశోక్, కట్ల పూర్ణచందర్, పైడిపల్లి రమేశ్, సింగనవేణి చిరంజీవి, టీజేఎస్ఎఫ్ జిల్లా అద్యక్షుడు మాడ హరీశ్రెడ్డి, యూత్ అధ్యక్షుడు బుర్ర రాజుగౌడ్, మహేందర్, రాకేశ్, శ్రీకాంత్ పటేల్ పాల్గొన్నారు.
గణపురం: మహిళల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దవేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతోపాటు మైలారం గాంధీనగర్లో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. గణపురంలో 188 నూతన పింఛన్ కార్డులు, 3 కల్యాణ లక్ష్మి చెక్కులు, మైలారంలో 31 నూతన పింఛన్ కార్డులు, మూడు కల్యాణలక్ష్మి చెక్కులు, గాంధీనగర్లో 44 నూతన పెన్షన్కార్డులను, 2 కల్యాణ లక్ష్మి చెక్కులను, బుర్రకాయల గూడెంలో ఒక కల్యాణలక్ష్మి చెక్కును పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
బతుకమ్మ పండుగ పూట ఆడబ్డిలను గౌరవిస్తున్న ఘనత కేవలం సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. జిల్లాకు మంజూరైనా మెడికల్ కాలేజీ, ఆయుష్ దవాఖాన చెల్పూర్ గ్రామ పరిధిలోనే నిర్మించనునున్నట్లు తెలిపారు. సర్పంచ్లు పొట్ల నగేశ్, నారగాని దేవేందర్గౌడ్, నల్లాని అరుణ, మాదం మమత, తహసీల్దార్ సతీశ్ కుమార్, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీడీఓ హరిశ్చంద్ర, ఎంపీటీసీలు శివశంకర్గౌడ్, మరగాని సరస్వతి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఉప సర్పసంచ్ అశోక్ యాదవ్, గుజ్జ గంగాదర్రావు, మోతె కరుణాకర్రెడ్డి, బోయిని సాంబయ్య, గ్రామ అధ్యక్షుడు గుర్రం తిరుపతి గౌడ్ పాల్గొన్నారు.