వరంగల్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) భవనం లీజు పెద్ద వివాదంగా మారింది. రిజర్వు బ్యాం కు నిబంధనలకు విరుద్ధంగా డీసీసీబీ భవనాన్ని వాణిజ్య అవసరాలకు లీజుకు ఇచ్చేలా పనులు చేస్తుం డడంపై బ్యాంకు ఉద్యోగులు సోమవారం నిరసన తెలిపి తాళం వేశారు. సుబేదారి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ పిటిషన్పై పోలీసులు సోమ వారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీసీసీబీ భవ నం లీజు ప్రక్రియలో కీలకంగా ఉన్న ఒక డైరెక్టర్ సంబంధీకులు సోమవారం అర్ధరాత్రి తర్వాత భవనం తాళం పగులగొట్టి పనులు కొనసాగించారు. మంగ ళవారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో అధికారులు బ్యాంకుకు రాలేరనే ఉద్దేశంతో పనులు చేశారు. తాళం పగులగొట్టిన విషయంపై డీసీసీబీ సీఈవో చిన్నారావు, మరికొందరు ఉద్యోగులు కలిసి సుబేదారి పోలీసు స్టేషన్లో మరోసారి అనుబంధ పిటిషన్ ఇచ్చారు.
జేబీఎన్ స్టోన్ క్రషర్స్ సంస్థకు చెందిన వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా డీసీసీబీ భవనంలోకి ప్రవే శించి పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న జేబీఎన్ స్టోన్ క్రషర్స్ సంస్థ డీసీసీబీ పాలకమండలిలోని ఒక డైరెక్ట ర్కు సంబంధించిననే ఉద్యోగులు చెబుతున్నారు. రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలతో డీసీ సీబీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. డీసీసీబీ భవనం లీజు, ప్రస్తుత పోలీసు కేసు ల నమోదు అంశాలపై చర్చించేందుకు బ్యాంకు పాలకవర్గం బుధవారం సమావేశమవుతున్నది.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకుల భవనాలను ఇతర సంస్థలకు, అవసరాలకు లీజు ఇవ్వడంపై కుదరదు. దీనికి భిన్నంగా డీసీసీసీ భవనాన్ని లీజుకు ఇస్తే ఆర్బీఐ తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఉద్యోగులు చెబు తున్నారు. డీసీసీబీ పాలకవర్గాన్ని, బ్యాంకింగ్ లైసెన్స్ ను రద్దు చేసే అవకాశం ఉన్నదని అంటున్నారు. లీజు వ్యవహారంలో డీసీసీబీ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు అయితే వ్యవస్థ మొత్తం ఆగమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీసీసీబీ భవనం లీజు ప్రక్రియపై 8 ఏండ్లుగా వివా దాలు కొనసాగుతున్నాయి. డీసీసీబీ గత పాలక వర్గంలో ఇది మొదలైంది. 2015 సెప్టెంబర్ 11న జేబీఎన్ స్టోన్ క్రషర్స్ డీసీసీబీ భవనం లీజు కోసం ఒప్పందం చేసుకున్నది. అనంతరం భవనం నిర్మాణం కోసం నల్లబెల్లి కన్స్ట్రక్షన్కు కాంట్రాక్టు ఇచ్చింది. సహకార బ్యాంకు భవనం కావడంతో ఈ వ్యవ హారంపై ఫిర్యాదులు వచ్చాయి.
వీటి ఆధారంగా 2017లో తెలంగాణ రాష్ట్ర సహకార చట్టం కింద విచారణ నిర్వహించారు. విచారణ అధికారి సూచన మేరకు భవనం లీజు ఒప్పందాన్ని నిలిపివేస్తూ డీసీసీబీ సీఈవో మోమె జారీ చేశారు. భవనం లీజు నిబంధన లకు విరుద్ధంగా జరిగిందని పేర్కొంటూ అప్పటి పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. డీసీసీబీ పాలక అధికారిగా జిల్లా కలెక్టర్ నియమితులయ్యారు. లీజు దారుడు, నల్లబెల్లి కన్స్ట్రక్షన్ హైకోర్టును ఆశ్రయించారు.
బ్యాంకులను, బ్యాంకుల భవనాలను ఇతర ప్రైవేట్ వ్యవహారాలకు లీజుకు ఇవ్వరాదనే రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు భవనం నిర్మాణ పనులు నిలిపివేయాలని నల్లబెల్లి కన్స్ట్రక్షన్కు నోటీసు ఇచ్చారు. అప్పటికి వరకు నిర్మాణమైన భవనాన్ని బ్యాంకు అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం నల్లబెల్లి కన్స్ట్రక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భవనంపై బ్యాంకు ఇచ్చిన మెమోను హైకోర్టు తాత్కా లికంగా సస్పెండ్ చేసింది.
తుది ఉత్తర్వుల ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నది. 2017 సెప్టెంబర్లో ఆర్బీఐ ఇచ్చిన లేఖ ఆధారంగా డీసీసీబీ హైకోర్టుకు సమర్పించిన వివరాల మేరకు భవనం లీజుపై స్టేను కొనసాగించింది. సింగిల్ జడ్జి నేతృత్వంలో రెండు వర్గాల వాదనలు విని కేసు విచారణ ప్రక్రియను నిర్వహిస్తున్నది. 2020 ఫిబ్రవరి 28న కొత్త డీసీసీబీ పాలకవర్గం ఎన్నికైంది. భవనం లీజుపై న్యాయ అభి ప్రాయాల ప్రక్రియ కొనసాగింది. బ్యాంకింగ్ రెగ్యు లేషన్ యాక్టుకు 2021లో రిజర్వు బ్యాంకు కొన్ని సవ రణలు చేసింది.
బ్యాంకుల ఆడిట్, భవనాల లీజుపై కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. సహకార బ్యాంకులు సైతం ఆర్థిక సంవత్సరం ముగిసిన మూడు నెలలోపు ఆడిట్ పూర్తి చేయాలని… బ్యాంకుల భవనాలను, ఇతర ఆస్తులను ఇతర అవసరాలకు లీజుకు ఇవ్వడంపై చట్ట విరుద్ధమని పేర్కొన్నది. అన్ని రకాల వాణిజ్య, సహకార బ్యాంకులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తా యని పేర్కొన్నది. ఈ నిబంధనల మేరకు వరంగల్ డీసీసీబీ భవనం లీజు చట్టపరంగా చెల్లదని ఉద్యోగులు చెబుతున్నారు.