హనుమకొండ చౌరస్తా, జూలై 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తోందని రాష్ట్ర అర్చక ఉద్యోగుల జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర ఉద్యోగుల సంఘం కన్వీనర్ కాండూరి కృష్ణమాచారి అన్నారు. మంగళవారం హను మకొండ వేయిస్తంభాల దేవాలయం కుడా గార్డెన్స్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారని,ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. అర్చక సంఘం సీనియర్ నాయకుడు తనుగుల రత్నాకర్ మాట్లాడుతూ అర్చక ఉద్యోగుల వేతనాలు ఇక నుంచి దేవాదాయ శాఖకు సంబంధం లేకుండా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచే వచ్చేందుకు జాక్ కృషి చేసిందని తెలిపా రు.
నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచారి, అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యులు చిలకమర్రి శ్రవణ్ కుమారాచా ర్యులు, పాలకుర్తి సోమేశ్వరస్వామి దేవాలయం, అయి నవోలు మల్లికార్జునస్వామి దేవాలయం, కురవి వీరభద్ర స్వామి దేవాలయం, గట్టు మల్లన్న దేవాల యం, కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం, మెట్టు గుట్ట సీతారామస్వామి దేవాలయం, ఉర్సు నాగమయ్య దేవాలయం, బోగే శ్వరాలయం, చిల్పూరుగుట్ట, వేంకటే శ్వరాలయం, కొడువటూరు సిద్ధేశ్వరా లయం, నర్సింహులపేట, వేంకటేశ్వర స్వామి దేవాలయం, ఆకారపు కాశీ విశ్వేశ్వర దేవాలయం, కట్టమల్లన్న దేవాలయం, వేంకటేశ్వరస్వామి దేవా లయం, రామన్నపేట, బోగేశ్వరాల యం, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఖిలావరంగల్ శంభునిగుడి, బొమ్మలగు డి తదితర దేవాలయ అర్చకులు, ఉద్యోగులు, ఇతర సంఘాల్లో ఉన్నవారు, అర్చక, ఉద్యోగ జాక్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై వీలీనమైనట్లు తెలిపారు.
అర్చక ఉద్యోగ జాక్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్య క్షుడిగా పాతర్లపాటి నరేశ్కుమార్, ప్రధాన కార్యదర్శి గా ఉక్కర్సు సత్యనారాయణశర్మ, గౌరవాధ్యక్షుడిగా కంచెనపల్లి రాజేశ్వర్శర్మ, ఉపాధ్యక్షుడిగా నందనం మ ధుశర్మ, దేవగిరి అనిల్, పెనుగొండ అనిల్, ముఖ్య సల హాదారుగా తాటికొండ వినయ్కుమార్, కోశాధికారిగా రావిచేడు అనిల్, సంయుక్త కార్యదర్శిగా జాగర్ల మూడి రామశర్మ, బ్రాహ్మణపెల్లి రవీందర్శర్మ, నమఃశివాయ పరాశరం నందనాచార్యులు, లంకా శివకుమార్, మా దరబోయిన కట్టయ్య, ప్రచార కార్యదర్శిగా తనుగుల అనిల్, కార్యవర్గ సభ్యులుగా మక్కామల మెట్టుపల్లి శ్రీధరాచార్యులు, హనుమకొండ, వరంగల్ పట్టణ, నగర అధ్యక్షులుగా శివపురం రామలింగా ఆరాధ్య, ప్ర ధాన కార్యదర్శిగా కొత్తపెల్లి మణికుమార్, ఉపాధ్యక్షుడి గా శంభులింగం, మలిపాలెం శివకుమార్, మహేశ్శర్మ ను ఎన్నుకున్నారు. వారికి కండువాకప్పి పదవీ బాధ్య తలను అప్పగించారు.
అనంతరం దేవాలయ ఉద్యోగు ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అద్దంకి కిరణ్ కుమార్(అయినవోలు దేవస్థానం) ప్రధాన కార్యద ర్శిగా ఆర్ సంజీవరావు(కొత్తకొండ), ఉపాధ్యక్షుడిగా భాస్కర్(మెట్టుగుట్ట)ను నియమించినట్లు తెలిపారు.