వనపర్తి, అక్టోబర్ 16: వనపర్తి రాజవంశీయులు రాజాకృష్ణదేవరావు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ప్రజలతో కలిసి శుక్రవారం దసరా వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ముందుగా పట్టణంలోని రాజగారి బంగ్లాలో రాజులకాలంలో కొలువుదీరిన మైసమ్మకు, అమ్మవారికి, ఆ కాలంలో వాడిన ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంగ్లా నుంచి రాజవంశస్తులతో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి ర్యాలీగా బయలుదేరి శమీవృక్షం వద్దకు చేరుకున్నారు. ముందుగా పండితుడు రాజవంశస్తులు రాజాకృష్ణదేవరావు, మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి శమీవృక్షం వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాకృష్ణదేవరావు మంత్రి నిరంజన్ రెడ్డి ఒకరికొకరు శమీఆకులు పెట్టుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లింలకు దసరా విందు
దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ముస్లింలకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం లు ముందుగా మంత్రి నిరంజన్రెడ్డికి పండుగ శుభాకాంక్షలను తెలిపి శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మత సామరస్యానికి వనపర్తి ప్రతీక అని, ముస్లింలకు విందు భోజనం పెట్టారు. అంతకుముందు స్థానిక నాయకులు మంత్రికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు, చైర్మన్ రమేశ్గౌడ్, మైనార్టీ నాయకుడు జహంగీర్, నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు.
అండర్ డ్రైనేజీని శుభ్రం చేయాలి
వర్షాలు రావడంతో రైల్వే బ్రిడ్జికింద నీళ్లు నిలువడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా ఊరి నుంచి బాలానగర్కు రావాలంటే బైక్ మీద వస్తున్నాం. బ్రిడ్జి కింద తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతున్నది. బ్రిడ్జి కింద నీళ్లు పోవడానికి రైల్వేశాఖ అధికారులు స్పందించి అండర్ డ్రైనేజీని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం
వర్షాలు పడడంతో రైల్వే బ్రిడ్జి కింద నీళ్లు నిల్వ ఉంటున్నాయి. బాలానగర్కు వెళ్లాలంటే తీవ్ర ఇ బ్బందులు పడుతు న్నాం. వర్షం పడితే బ్రిడ్జి కింద డ్రైనేజీలో ఎక్కువగా చెత్తాచెదారం నిలిచి నీళ్లు నిల్వ ఉంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్బందులు నిజమే..
కాచిగూడ నుంచి కర్నూలు వరకు 15 అండర్ పాస్లు ఏర్పాటు చేశారు. కానీ, కొన్నిచోట్ల సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడు బ్రిడ్జి దాటి వెళ్లడం కష్టంగా మారుతున్నది. దీనిపై రైల్వేశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తాం.